Road Accident: పండగ రోజు ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

|

Oct 12, 2024 | 2:14 PM

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా జరుగుతూనే ఉంటున్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, ఓవర్‌ టెక్‌ తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో..

Road Accident: పండగ రోజు ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
Road Accident
Follow us on

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా జరుగుతూనే ఉంటున్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, ఓవర్‌ టెక్‌ తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దసరా పండగ రోజు హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం కైతాల్‌ సమీపంలోని మండ్రిలో చోటు చేసుకుంది. విషయం తెలుకున్న స్థానికులు పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మృతులు కైతాల్‌లోని డీగ్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. కాగా, ఓ చిన్నారి కనిపించకుండా పోవడంతో ఆ చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుల్లో నలుగురు బాలికలు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే కుటుండానికి చెందిన వీరంతా జాతరకు వెళ్తున్నట్లు సమాచారం. ముండ్రి సమీపంలోకి రాగానే కారు ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి