5G Network: దేశ వ్యాప్తంగా 50 నగరాల్లో అందుబాటులోకి వచ్చిన 5జీ సేవలు.. మీ నగరం ఉందేమో చూసుకోండి..

|

Dec 13, 2022 | 6:24 PM

5G Network భారతదేశ వ్యాప్తంగా అక్టోబర్ నెల నుంచే 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రెండూ 5జీ విప్లవానికి నాంది పలికాయి. ఈ విషయం విఐ కాస్త వెనుకబడింది.

5G Network: దేశ వ్యాప్తంగా 50 నగరాల్లో అందుబాటులోకి వచ్చిన 5జీ సేవలు.. మీ నగరం ఉందేమో చూసుకోండి..
5g Technology
Follow us on

భారతదేశ వ్యాప్తంగా అక్టోబర్ నెల నుంచే 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రెండూ 5జీ విప్లవానికి నాంది పలికాయి. ఈ విషయం విఐ కాస్త వెనుకబడింది. అయితే, భారతదేశపు అగ్రశ్రేణి టెలికాం ప్రొవైడర్లు అయిన జియో, ఎయిర్‌టెల్ సమిష్టిగా దేశంలోని దాదాపు 50 నగరాల్లో 5G సేవలను ప్రారంభించాయి. అంతేకాదు.. ఇటీవలి కాలంలో వైర్‌లెస్ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

పార్లమెంట్‌లో మంత్రి మాట్లాడుతూ.. ‘టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు దేశంలో అక్టోబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా 5జి సేవలను ప్రారంభించాయి. నవంబర్ 26వ తేదీ నాటికి దేశంలోని 50 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. 5జీ సేవలకు ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం జరుగదు. అంటే.. కస్టమర్ ఇప్పటికీ ఎయిర్‌టెల్, జియో వినియోగిస్తున్నట్లయితే.. 5జీ నెట్‌వర్క్‌ని యాక్సెస్ చేయడానికి అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.

5జి నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులో ఉన్న మొత్తం 50 పట్టణాల జాబితా ఇదే..

1. నోయిడా

ఇవి కూడా చదవండి

2. ఢిల్లీ

3. గ్రేటర్ నోయిడా

4. సిలిగురి

5. గురుగ్రామ్

6. బెంగళూరు

7. హైదరాబాద్

8. వారణాసి

9. ముంబై

10. నాగ్‌పూర్

11. చెన్నై

12. పానిపట్

13. గౌహతి

14. పాట్నా

15. హైదరాబాద్

16. బెంగళూరు

17. ఫరీదాబాద్

18. ముంబై

19. వారణాసి

20. కోల్‌కతా

21. చెన్నై

22. నాథద్వారా

23. పూణే

24. గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..