మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండ్లా ప్రాంతంలోని జబల్పూర్ జాతీయ రహదారి30పై ఓ పికప్ వాహనం, మిని ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు..
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండ్లా ప్రాంతంలోని జబల్పూర్ జాతీయ రహదారి30పై ఓ పికప్ వాహనం, మిని ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. మండ్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో పికప్ వాహనంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మిని ట్రక్కులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మరణించినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.
Read More
భవనంలో భారీ పేలుడు.. 16 మందికి గాయాలు