AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యానుని దొంగిలించి.. డ్రైవింగ్ రాకా 10 కి.మీ తోసుకెళ్లారు.. చివరికి ఏం జరిగిందంటే

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముగ్గరు దొంగలు కారుని దొంగలించి దాదాపు 10 కిలోమీటర్ల వరకు తోసుకుంటూ వెళ్లడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే మే 7 వ తేదిన.. సత్యం కుమార్, అమన్ గౌతమ్, అమిత్ వర్మ అనే ముగ్గురు కాలేజీ విద్యార్థులు ఓ వ్యాన్‌ను దొంగతనం చేశారు.

వ్యానుని దొంగిలించి.. డ్రైవింగ్ రాకా 10 కి.మీ తోసుకెళ్లారు.. చివరికి ఏం జరిగిందంటే
Van
Aravind B
|

Updated on: May 25, 2023 | 5:08 AM

Share

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముగ్గరు దొంగలు కారుని దొంగలించి దాదాపు 10 కిలోమీటర్ల వరకు తోసుకుంటూ వెళ్లడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే మే 7 వ తేదిన.. సత్యం కుమార్, అమన్ గౌతమ్, అమిత్ వర్మ అనే ముగ్గురు కాలేజీ విద్యార్థులు ఓ వ్యాన్‌ను దొంగతనం చేశారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఏంటంటే ఆ ముగ్గురిలో ఎవరికి కూడా డ్రైవింగ్ రాదు. చివరకి చేసేదేమి లేక దబౌలి నుంచి కళ్యాణ్‌పుర్ వరకు దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఆ వ్యాన్‌ను తోసుకుంటూ వెళ్లారు. అలాగే వారు ఆ వ్యానుకి నెంబర్ ప్లేట్ కూడా తొలగించారు. దాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాచేందుకు యత్నించారు. అలాగే ఆ కారును కూడా అమ్మేయాలని కుట్ర పన్నారు.

అయితే సమాచారం తెలుసున్న పోలీసులు నిందితులును అరెస్టు చేశారు. అమిత్ వర్మ అనే వ్యక్తి ఈ దొంగతనం ప్లాన్ వేశాడని తెలిపారు.అయితే ఈ ముగ్గురు కూడా వ్యాన్‌ను దొంగిలించిన ఓ వెబ్‌సైట్ జ్వారా అమ్మేయాలని అనుకున్నట్లు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న సత్యం కుమార్ ఓ వెబ్‌సైట్‌ను డిజైన్ చేశాడని.. అందులో నుంచి వారు ఆ వ్యానుని అమ్మేయాలని అనుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ తాము సమాచారం తెలుసుకొని వాళ్లని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం