Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం! 14 మంది మృతి.. 27 మందికి తీవ్ర గాయాలు

అసోంలోని గోలాఘాట్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకుల బస్సుతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ఒక మైనర్ బాలుడు సహా దాదాపు 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి 37లోని డెర్గావ్ వద్ద తెల్లవారుజామున 5 గంటలకు ఈ సంఘటన జరిగింది...

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం! 14 మంది మృతి.. 27 మందికి తీవ్ర గాయాలు
Road Accident
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 03, 2024 | 9:07 AM

గోలాఘాట్, జనవరి 3: అసోంలోని గోలాఘాట్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకుల బస్సుతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ఒక మైనర్ బాలుడు సహా దాదాపు 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి 37లోని డెర్గావ్ వద్ద తెల్లవారుజామున 5 గంటలకు ఈ సంఘటన జరిగింది. సుమారు 45 మందితో గోలాఘాట్ నుంచి టిన్సుకియా వైపు వెళుతున్న బస్సును, అదే మార్గంలో ఎదురుగా వస్తున్న బొగ్గు లోడుతో వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన వారిని దేర్గావ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన వారిని జోర్హాట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జేఎంసిహెచ్)కి తరలించారు.

కాగా జాతీయ రహదారికి ఒకవైపు రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి. అందుకే రెండు వైపుల నుంచి వచ్చే వాహనాలు డివైడర్‌కి ఒకవైపు నుంచే వెళ్తున్నాయి. ఈ క్రమంలో అతి వేగంతో వస్తున్న ట్రక్కు బస్సును ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారని గోలాఘాట్ డిప్యూటీ కమిషనర్ పి ఉదయ్ ప్రవీణ్ తెలిపారు. బస్సులోని ప్రయాణికుల్లో ఎక్కువ మంది బరలుఖువా గ్రామానికి చెందినవారున్నారు. టిన్సుకియాలోని తిలింగ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బస్సు, ట్రక్కు నుంచి 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, గాయపడిన 27 మందిని జెఎంసిహెచ్‌కి తరలించగా, ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ట్రక్‌ డ్రైవర్‌ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగినట్లుకేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు ప్రారంభించామని గోలాఘాట్ పోలీసు సూపరింటెండెంట్ రాజేన్ సింగ్ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.