ఉత్తరాఖండ్ విషాదం, ఇంకా ఆచూకీ తెలియని 136 మంది, కొనసాగుతున్న సహాయక చర్యలు

| Edited By: Anil kumar poka

Feb 23, 2021 | 12:40 PM

ఉత్తరాఖండ్ లోని ఛమోలీ జిల్లాల్లో ఈ నెల 7 న సంభవించిన జల విలయం తాలూకు ఆనవాళ్లు ఇంకా చెరిగిపోలేదు. గ్లేసియర్ ఔట్ బరస్ట్, కొండ చరియలు విరిగిపడడం,

ఉత్తరాఖండ్ విషాదం, ఇంకా ఆచూకీ తెలియని 136 మంది, కొనసాగుతున్న సహాయక చర్యలు
Follow us on

136 missing after uttarakhand disaster:ఉత్తరాఖండ్ లోని ఛమోలీ జిల్లాల్లో ఈ నెల 7 న సంభవించిన జల విలయం తాలూకు ఆనవాళ్లు ఇంకా చెరిగిపోలేదు. గ్లేసియర్ ఔట్ బరస్ట్, కొండ చరియలు విరిగిపడడం, నదులకు వెల్లువెత్తిన వరదలతో ముఖ్యంగా ఈ జిల్లా కకావికలమైంది. 136 మంది జాడ ఇంకా తెలియడంలేదు.  వీరికోసం సహాయక బృందాలు ఇప్పటికీ గాలిస్తున్నాయి. ఇప్పటివరకు 60 కి పైగా మృతదేహాలను  స్వాధీనం చేసుకున్నారు. అలకానంద, దౌలీ గంగా నదులకు వచ్చిన మెరుపు వరదలతో ఓ జల విద్యుత్ కేంద్రం, 5 వంతెనలు కొట్టుకు పోగా, మరో పవర్ ప్రాజెక్టు తీవ్రంగా దెబ్బ తిన్నది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండో-టిబెటన్ ఫోర్స్, పోలీసు, పారామిలిటరీ బలగాలు ఇంకా గాలింపులు కొనసాగిస్తున్నాయి. గల్లంతయిన వారి డీ ఎన్ ఏ శాంపిల్స్ కోసం వారి కుటుంబాలను పిలిపిస్తున్నారు.

కాగా ఉత్తరాఖండ్ లో జరుగుతున్న అభివృధ్ది పనుల కారణంగా తరచూ ఈ రాష్ట్రం ప్రకృతి వైపరీత్యాలకు గురవుతోందన్న పర్యావరణ వేత్తల ఆందోళనను కేంద్రం తోసిపుచ్చింది. చార్ ధామ్ సమీపంలో ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులకు, గ్లేసియర్ ఔట్ బరస్ట్ కు సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

Read More :

ఇక ఓపెన్, క్రిమినల్ ప్రాసిక్యూటర్లకు ట్రంప్ టాక్స్ రికార్డులు, అమెరికా సుప్రీంకోర్టు అనుమతి