
World Travel, Tourism Festival 2025: టీవీ9 నెట్వర్క్, రెడ్ హ్యాట్ కమ్యూనికేషన్స్ వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్ను నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు ఢిల్లీలోని ప్రసిద్ధ మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో నిర్వహించబడుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం భారతీయ పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించడంతో పాటు పర్యాటకులకు వేదికను కూడా అందిస్తుంది. ఈ ఫెస్టివల్ పర్యాటకులకు మాత్రమే కాకుండా ప్రయాణ, పర్యాటక పరిశ్రమలకు ఉపయోగపడనుంది.
ఇది భారతదేశపు మొట్టమొదటి బిజినెస్ టు కన్స్యూమర్ ట్రావెల్ అండ్ టూరిజం ఈవెంట్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిజం బోర్డులు, బ్రాండ్లు, పర్యాటకులను ఒకే చోట చేర్చుతుంది. మహమ్మారి తర్వాత, భారతదేశం నుండి విదేశీ ప్రయాణాలు 85 శాతం పెరిగాయి. అటువంటి పరిస్థితిలో భారతీయ ప్రయాణికులలో ప్రపంచ ప్రయాణానికి ప్రాధాన్యత పెరుగుతున్న సమయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.
భారతీయ ప్రయాణికులకు ఈ ఈవెంట్ కొత్త, విభిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ఈ ఫెస్టివల్ ప్రయాణానికి భారతీయ విధానాన్ని మార్చడమే కాకుండా, భారతీయ ప్రయాణికులు ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి, కొత్త సమాచారం, ఆఫర్లను పొందేందుకు గొప్ప వేదికను కూడా అందిస్తుంది. ఈ ఫెస్టివల్ ద్వారా భారతీయ ప్రయాణికులు కొత్త ప్రయాణ ప్రపంచాన్ని అనుభవించడమే కాకుండా, వారి ప్రయాణానికి ముఖ్యమైన సలహాలు, ప్రత్యేక ఆఫర్లు, బహుమతులు కూడా పొందుతారు.
వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్ 2025 గురించి..
ఈవెంట్ ముఖ్యాంశాలు:
ఈవెంట్ను మిస్కాకండి
మీరు సాంస్కృతిక ఔత్సాహికులైనా, టెక్ ప్రేమికులైనా లేదా ఎవరైనా ప్రయాణ స్ఫూర్తిని కోరుకునే వారైనా, వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఫెస్టివల్ 2025 మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎన్నో విషయాలను తెలుసుకునేందుకు దోహదపడుతుంది. ఈ ఈవెంట్ మీ జీవితంలో మధురమైనజ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ఢిల్లీలోని ప్రయాణ ప్రియులందరూ ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు జరిగే ఈ ఈవెంట్లో భాగమవ్వండి. ఇందుకోసం మీరు ప్రయాణానికి సిద్దమవ్వండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి