AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Tourism: ‘సాగర్‌ టూ శ్రీశైలం’.. కృష్ణా నది అలలపై అందాల ప్రయాణం మొదలైంది..

పర్యాటకులకు తెలంగాణ టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకు బోటులో వెళ్లే విధంగా టూర్ ను తీసుకొచ్చింది.

Telangana Tourism: 'సాగర్‌ టూ శ్రీశైలం'.. కృష్ణా నది అలలపై అందాల ప్రయాణం మొదలైంది..
Telangana Tourism
Narender Vaitla
|

Updated on: Nov 02, 2024 | 6:41 PM

Share

నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణ నదిలో బోటులో ప్రయాణం.. చుట్టూ ప్రకృతి అందాలు, చల్లటి గాలి ఊహించుకోవడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదూ! ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ అద్భుత క్షణం రానే వచ్చేసింది. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ బోటు ప్రయాణం అందుబాటులోకి వచ్చేసింది.

తెలంగాణ టూరిజం ఈ టూర్‌ ప్యాకేజీని ప్రారంభించింది. కార్తీక మాసం తొలి రోజును పురస్కరించుకొని అధికారులు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. నిజానికి గడిచిన కొన్నేళ్ల నుంచి ఈ బోటును నడిపించేందుకు ప్రణాళికలు వేశారు. అయితే కరోనా, ఆ తర్వాత సరైన వర్షాలు లేని కారణంగా బోటు ప్రయాణం వీలుపడలేదు. అయితే తాజాగా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు గరిష్ఠ స్థాయిలో నీరు అందుబాటులో ఉండడంతో బోటు ప్రయాణాన్ని ప్రారంభించింది.

సుమారు 120 కిలోమీటర్ల మేర ఈ ప్రయాణం ఉంటుంది. నాగార్జున సాగర్‌లో ప్రారంభమయ్యే ఈ బోటు ప్రయాణం నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాతాల మీదుగా ఉంటుంది. ఇక మరొక మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా పర్యాటకాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొల్లాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు ఇవాళ ప్రారంభించారు.

ప్యాకేజీ వివరాలు..

ప్యాకేజీ ధర విషయానికొస్తే.. బోటు ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600గా నిర్ణయించారు. పూర్తి వివరాలు, బుకింగ్ కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలని అధికారులు తెలిపారు. అయితే.. నాగార్జునసాగర్‌ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నేరుగా హైదరాబాద్ నుంచి కూడా టూర్ ఆపరేట్ చేస్తున్నారు.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

జియో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌
జియో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?