IRCTC: రామేశ్వరం వన్‌డే టూర్ ప్యాకేజీ.. మదురై నుంచి జ్యోతిర్లింగ దర్శనం.. పూర్తి షెడ్యూల్, ఛార్జీలు ఇవే!

Rameswaram One Day Tour Package: మదురై నుంచి ఒకే రోజులో రామేశ్వరం జ్యోతిర్లింగ దర్శనం చేయాలనుకుంటున్నారా? రామేశ్వరం వన్‌డే టూర్ ప్యాకేజీలో పాంబన్ బ్రిడ్జ్, అగ్ని తీర్థం, రామనాథస్వామి ఆలయం, ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ సందర్శనతో పాటు పూర్తి షెడ్యూల్, టూర్ ఛార్జీలు, ప్యాకేజీ వివరాలను తెలుసుకోండి.

IRCTC: రామేశ్వరం వన్‌డే టూర్ ప్యాకేజీ.. మదురై నుంచి జ్యోతిర్లింగ దర్శనం.. పూర్తి షెడ్యూల్, ఛార్జీలు ఇవే!
Rameswaram One Day Tour Package

Updated on: Jul 10, 2026 | 5:01 PM

RAMESHWARAM ONE DAY TRIP (SMH109): దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో రామేశ్వరం ఒకటి. ఇక్కడ వెలసిన శ్రీ రామనాథస్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. రామాయణంతో ముడిపడి ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని శైవులు, వైష్ణవులు సమానంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం ‘కాశీ యాత్ర చేసిన వారు రామేశ్వరం దర్శనం చేసుకుంటేనే యాత్ర సంపూర్ణమవుతుందని’ విశ్వాసం. అందుకే రామేశ్వరాన్ని దక్షిణ కాశీ లేదా బెనారస్ ఆఫ్ ది సౌత్ అని కూడా పిలుస్తారు. ఆధ్యాత్మికతతో పాటు సముద్ర తీర అందాలు, చారిత్రక ప్రదేశాలను ఒకే రోజులో సందర్శించాలనుకునే భక్తులకు ఈ ‘రామేశ్వరం వన్‌డే టూర్ ప్యాకేజీ’ మంచి ఎంపికగా ఉంటుంది.

రామేశ్వరం వన్‌డే టూర్ ప్యాకేజీ వివరాలు

  • ప్యాకేజీ పేరు: రామేశ్వరం వన్‌డే ట్రిప్
  • గమ్యస్థానం: రామేశ్వరం
  • ప్రయాణ విధానం: రోడ్డు మార్గం
  • వాహనం: ఏసీ ప్రత్యేక వాహనం
  • గరిష్ట ప్రయాణికులు: 10 మంది
  • అందుబాటు: వారంలోని అన్ని రోజులు

టూర్ ఛార్జీలు (ఒక్కో వ్యక్తికి)

  • 1 వ్యక్తి (సింగిల్ ఆక్యుపెన్సీ): ₹7,150
  • 2 మంది (ట్విన్ షేరింగ్): ఒక్కొక్కరికి ₹3,600
  • 3 మంది (ట్రిపుల్ షేరింగ్): ఒక్కొక్కరికి ₹2,400
  • పిల్లలు: ₹900
  • 4 నుంచి 6 మంది (ట్విన్/ట్రిపుల్ షేరింగ్): ఒక్కొక్కరికి ₹2,350
  • పిల్లలు: ఒక్కొక్కరికి ₹2,350

టూర్ షెడ్యూల్

ఈ యాత్ర ఉదయం 6 గంటలకు మదురై నుంచి ప్రారంభమవుతుంది. సుమారు ఉదయం 9:30 గంటలకు రామేశ్వరం చేరుకుంటారు. మార్గమధ్యంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాంబన్ బ్రిడ్జ్ (ఇందిరా గాంధీ రోడ్ బ్రిడ్జ్) అందాలను వీక్షించే అవకాశం ఉంటుంది. సముద్రంపై నిర్మించిన ఈ వంతెన ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. రామేశ్వరం చేరుకున్న తర్వాత ముందుగా అగ్ని తీర్థంలో పవిత్ర స్నానం చేయవచ్చు. అనంతరం శ్రీ రామనాథస్వామి జ్యోతిర్లింగ ఆలయంలో స్వామివారి దర్శనం ఉంటుంది.

మధ్యాహ్న భోజనం అనంతరం ఈ ప్రదేశాలను సందర్శిస్తారు:

ఇవి కూడా చదవండి
  • పంచముఖి హనుమాన్ ఆలయం
  • రామర్ పాదం
  • మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారక స్థూపం

సాయంత్రం తిరుగు ప్రయాణం ప్రారంభమై రాత్రి 10 గంటలకు మదురై చేరుకుంటారు.

ప్యాకేజీలో ఏమేం ఉంటాయి?

  • మొత్తం యాత్రకు ప్రత్యేక ఏసీ వాహనం
  • షెడ్యూల్ ప్రకారం అన్ని దర్శనాలు, సందర్శనలు
  • ట్రావెల్ ఇన్సూరెన్స్
  • టోల్ చార్జీలు
  • పార్కింగ్ ఫీజులు
  • వర్తించే అన్ని పన్నులు

ప్యాకేజీలో లేని సేవలు

  • రైలు లేదా విమాన టికెట్లు
  • దర్శన ప్రాంతాల ప్రవేశ రుసుములు
  • భోజనం
  • టూర్ గైడ్ సేవలు
  • వ్యక్తిగత ఖర్చులు (మినరల్ వాటర్, ఫోన్, లాండ్రీ, టిప్స్ మొదలైనవి)
  • వీడియో లేదా స్టిల్ కెమెరా ఫీజులు
  • ప్రయాణ ప్రణాళికలో లేని అదనపు సేవలు

ఎందుకు ఈ ప్యాకేజీని ఎంచుకోవాలి?

ఒకే రోజులో రామనాథస్వామి జ్యోతిర్లింగ దర్శనం, అగ్ని తీర్థ స్నానం, పాంబన్ బ్రిడ్జ్ సందర్శనం, ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ వంటి ప్రముఖ ప్రదేశాలను సౌకర్యవంతంగా దర్శించుకునే అవకాశం ఈ ప్యాకేజీ ద్వారా లభిస్తుంది. కుటుంబ సభ్యులు, భక్తులు, సీనియర్ సిటిజన్లకు కూడా ఇది అనుకూలమైన ఆధ్యాత్మిక యాత్రగా చెప్పవచ్చు.

ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us