2024 కేంద్ర బడ్జెట్లో భారత ప్రభుత్వం నుంచి రూ. 15,000 కోట్ల నిధులు పొందిన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిని సందర్శిద్దాం. గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఉన్న అమరావతి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా గుర్తింపు పొందింది. ఇది ఒక ప్రత్యేకమైన నగరం. చాలా ఆవిష్కరణలతో నిండినది. ఆంధ్రప్రదేశ్ను సందర్శించాలనుకుంటే అమరావతిలోని అద్భుతాలను కనుగొనండి.
అమరావతి బౌద్ధం వారసత్వం కలిగిన ప్రదేశం. శాతవాహనులు, పల్లవులు రాకముందు అశోక చక్రవర్తి ఇక్కడ స్థూపం నిర్మించాడు. బుద్ధుని జీవితాన్ని వర్ణించే శిల్పాలు ఉన్న ఈ స్థూపం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. అలాగే 2వ శతాబ్దం నాటి అమరేశ్వర ఆలయం కూడా ఇక్కడ ఉంది. ఇది శివుడికి అంకితం చేయబడింది.
2014లో తెలుగుదేశం పార్టీ అమరావతిని కొత్త రాజధానిగా ప్రతిపాదించగా.. 2019 ఎన్నికల తర్వాత అభివృద్ధి కొంతసేపు ఆగిపోయింది. అయినప్పటికీ 2024 ఎన్నికల తర్వాత TDP మళ్లీ అధికారంలోకి రావడంతో అమరావతికి కొత్త ఉత్సాహం లభించింది. 2024 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతికి రూ. 15,000 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులతో అమరావతి అభివృద్ధి జోరందుకుంటుందని భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించారు. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలంలో అమరావతిని సందర్శించడం ఉత్తమం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విజయవాడ విమానాశ్రయం అమరావతి నుంచి 37 కి.మీ దూరంలో ఉంది. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 17 కి.మీ దూరంలో ఉంది. నగరానికి చేరుకోవడం సులభం.
అమరావతిలోని పంచారామ క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం కృష్ణా నది ఒడ్డున ఉంది. మహా శివరాత్రి సమయంలో సందర్శించడం అనుకూలం. ఇంద్రుడు సృష్టించిన ఈ ఆలయం భక్తులకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
బౌద్ధ పురావస్తు మ్యూజియంలో బౌద్ధ విగ్రహాలు, అమరావతి స్థూపం శిల్పాలు చూడవచ్చు. ఈ స్థూపం అశోక కాలం నాటిది.. బుద్ధుని జీవితాన్ని వివరించే శిల్పాల కారణంగా ప్రసిద్ధి చెందింది.
125 అడుగుల ఎత్తైన ధ్యాన బుద్ధ విగ్రహం కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ విగ్రహం ధ్యాన భంగిమలో ఉండి ప్రయాణికులకు శాంతిని ఇస్తుంది.
అమరావతి నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న ఈ గుహ ఆలయాలు 6వ శతాబ్దానికి చెందినవి. బౌద్ధం, జైన మతం ప్రభావంతో ఈ ఆలయాలు పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉంటాయి.
అమరావతి నుంచి 36 కి.మీ దూరంలో ఉన్న కొండపల్లి కోట 14వ శతాబ్దానికి చెందినది. ఇది పురాతన శిల్పకళలకు చక్కని ఉదాహరణ.
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన సందర్శన ప్రదేశాల్లో ఒకటి.