IRCTC Tour Package: ఒకే యాత్రలో 3 ధామాలు.. 11 జ్యోతిర్లింగాల దర్శనం! IRCTC అదిరిపోయే ప్యాకేజీ వివరాలు ఇవే!

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను , పవిత్ర జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) ఒక అద్భుతమైన ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. 'భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు' ద్వారా సాగే ఈ యాత్రలో ప్రయాణికులు ఒకే ట్రిప్‌లో 3 ప్రధాన ధామాలు , 11 పవిత్ర జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. భక్తులు కేవలం తమ సీట్లను బుక్ చేసుకుంటే సరిపోతుంది; ప్రయాణ ఏర్పాట్లు, హోటల్ వసతి, స్వచ్ఛమైన శాకాహార భోజనం , స్థానిక రవాణా బాధ్యతలను ఐఆర్‌సీటీసీనే చూసుకుంటుంది. ఈ సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్యాకేజీ విశేషాలు , ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

IRCTC Tour Package: ఒకే యాత్రలో 3 ధామాలు.. 11 జ్యోతిర్లింగాల దర్శనం! IRCTC అదిరిపోయే ప్యాకేజీ వివరాలు ఇవే!
Irctc Bharat Gaurav Train Booking

Updated on: Jun 11, 2026 | 12:16 PM

ప్రతిసారిలాగే ఈసారి కూడా ఐఆర్సీటీసీ భక్తుల కోసం మంచి ఆఫర్లను ప్రకటించింది. తాజాగా భారతీయ రైల్వే పర్యాటక విభాగం “దేవ దర్శన యాత్ర: 3 ధామాలు , 11 జ్యోతిర్లింగాలు” టూర్ ప్యాకేజీ వివరాలు వెల్లడించింది. ఈ టూర్ సెప్టెంబర్ 3న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి అధికారికంగా ప్రారంభమవుతుంది. మొత్తం 17 రాత్రులు, 18 రోజుల పాటు సాగే ఈ మహా యాత్రలో రైలు సుమారు 10,000 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని ప్రయాణిస్తుంది. ఒకేసారి భారత్‌లోని అన్ని ప్రధాన శైవ, వైష్ణవ క్షేత్రాలను సందర్శించాలనుకునే వృద్ధులకు , కుటుంబాలకు ఈ ప్యాకేజీ ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.

బోర్డింగ్ స్టేషన్లు , సందర్శించే పుణ్యక్షేత్రాలు
ఈ ప్రత్యేక రైలు కేవలం ఢిల్లీలోనే కాకుండా ఘజియాబాద్, అలీగఢ్, తుండ్లా, ఎటావా, కాన్పూర్ , ప్రయాగ్‌రాజ్ స్టేషన్లలో కూడా ప్రయాణికులను ఎక్కించుకునే (Boarding) సదుపాయాన్ని కల్పిస్తోంది.

ఈ 18 రోజుల ప్రయాణంలో భక్తులు తూర్పున జగన్నాథపురి, దక్షిణాన రామేశ్వరం , పశ్చిమాన ద్వారకాధీష్ వంటి 3 ప్రముఖ ధామాలను సందర్శిస్తారు. వీటితో పాటు కాశీ విశ్వనాథ్, బైద్యనాథ్ ధామ్, మల్లికార్జున, భీమశంకర్, ఘృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్, మహాకాళేశ్వర్ , ఓంకారేశ్వర్ సహా మొత్తం 11 పవిత్ర జ్యోతిర్లింగాలను దర్శించుకునే వీలుంటుంది. ఈ యాత్ర వారణాసి, డియోఘర్, పూరీ, రామేశ్వరం, పూణే, నాసిక్, ద్వారక, సోమనాథ్ , ఉజ్జయిన్ వంటి ప్రధాన నగరాల మీదుగా సాగుతుంది.

ఆధునిక సౌకర్యాలు
ఈ భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ , థర్డ్ ఏసీ క్లాసులు మాత్రమే ఉంటాయి. అత్యంత విలాసవంతంగా డిజైన్ చేసిన ఈ రైలులో కేవలం 150 మంది ప్రయాణికులకు మాత్రమే వసతి కల్పిస్తారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైలు లోపలే ఒక చక్కని రెస్టారెంట్, పూర్తి సదుపాయాలున్న వంటగది, ఆధునిక షవర్ క్యూబికల్స్, సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. భద్రత కోసం పూర్తి రైలు అంతటా సీసీటీవీ (CCTV) నిఘా , ప్రత్యేక సెక్యూరిటీ గార్డుల పహారా ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ నిబంధనల ప్రకారం ప్రయాణికులు చెల్లించే టిక్కెట్ ధరలోనే కింది సేవలన్నీ ఫ్రీగా పొందొచ్చు.

రైలు ప్రయాణ ఛార్జీలు.

ఆయా పుణ్యక్షేత్రాల నగరాలలో త్రీ-స్టార్ (3-Star) హోటళ్లలో వసతి.

ప్రయాణ సమయం అంతటా లభించే ప్యూర్ వెజిటేరియన్ (స్వచ్ఛమైన శాకాహార) భోజనం.

స్థానిక ప్రదేశాల సందర్శన కోసం ప్రత్యేక ఏసీ వాహనాల సౌకర్యం.

ప్రయాణికులందరికీ వర్తించే ట్రావెల్ ఇన్సూరెన్స్ (ప్రయాణ బీమా).

యాత్ర పొడవునా సహాయం అందించే టూర్ మేనేజర్ సేవలు.

క్లాస్ వైజ్ టిక్కెట్ ధరల వివరాలుఈ ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక యాత్రకు ఎంచుకునే వసతిని బట్టి ఛార్జీలు ఇలా నిర్ణయించారు

రైలు ప్రయాణ క్లాస్ (Class)ఒకరి టిక్కెట్ ధర, ఏసీ థర్డ్ క్లాస్ (3 AC) రూ.1,49,965ఏసీ, సెకండ్ క్లాస్ (2 AC) రూ.1,81,995, ఏసీ ఫస్ట్ క్లాస్ (1 AC)రూ.1,98,010

ఈ ప్యాకేజీలో సీట్లు చాలా పరిమితంగా (కేవలం 150 సీట్లు) ఉన్నందున, ఆసక్తి గల భక్తులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా వారి అధికారిక పర్యాటక కేంద్రాలను సంప్రదించి ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చు.

Follow Us