
మెట్ గాలా వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేయడమే కాకుండా, భారతీయ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త సుధా రెడ్డికి దక్కింది. వెండితెర తారల కంటే మిన్నగా మెరిసిపోతూ, సుమారు రూ. 142 కోట్ల విలువైన వజ్రాల హారాన్ని ధరించి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం ఆభరణాల తోనే కాకుండా, మనీష్ మల్హోత్రా రూపొందించిన అద్భుతమైన ‘ట్రీ ఆఫ్ లైఫ్’ గౌనుతో మన సంస్కృతిని, వారసత్వాన్ని న్యూయార్క్ ఫ్యాషన్ వీధుల్లో ప్రతిబింబించిన సుధా రెడ్డి మెట్ గాలా ప్రయాణం గురించి తెలుసుకుందాం..
సుధా రెడ్డి ధరించిన ఈ అద్భుతమైన నెక్లెస్ ఆమె సొంత కలెక్షన్ లోనిది. దీని విలువ సుమారు 15 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 142.8 కోట్లు) ఉంటుందని అంచనా. ఈ నెక్లెస్ ప్రత్యేకతలు..
సుధా రెడ్డి ధరించిన ఈ ప్రత్యేకమైన గౌనును ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించారు. ‘ట్రీ ఆఫ్ లైఫ్’ (జీవన వృక్షం) థీమ్తో తయారైన ఈ దుస్తుల వెనుక లోతైన అర్థం దాగి ఉంది.
హైదరాబాద్ తన జన్మస్థలమే కాకుండా, తన జీవనశైలిలో ఒక భాగమని సుధా రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేల గంటల కష్టం, తరతరాల జ్ఞానం ఈ ఒక్క దుస్తుల్లో నిక్షిప్తమై ఉందని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. మన వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడమే తన లక్ష్యమని ఆమె వివరించారు. సుధా రెడ్డి 2021లో మొదటిసారి మెట్ గాలాలో అడుగుపెట్టారు. అప్పుడు ఫల్గుణి షేన్ పీకాక్ గౌనులో మెరిసిన ఆమె, ఈసారి తన అద్భుతమైన నెక్లెస్, దేశీయ కళతో ప్రపంచాన్ని ఫిదా చేశారు.