
ప్రస్తుతం మనం యాంత్రిక యుగంలో ఉన్నాం. ఉదయం పరిగున ప్రజారావాణా ఎక్కిన మొదలు రాత్రి కునుకు తీసే వరకు ఎన్నో పనుల్లోపడి ఆరోగ్యం విషయాన్ని పక్కన పెడుతున్నాం. ఒంట్లో బలం ఉన్నంత కాలం ఇలా చేయడం బాగానే ఉంటుంది. వయసు మీదపడే కొద్ది ఒక్కో సమస్య పుట్టుకొస్తుంది. ఈ క్రమంలో మనం తినే ఆహారం ముందుగా చేరేది రక్తంలోనే. అలాంటి రక్తాన్ని శుద్ది పరిచేందుకు దోహదపడేది రక్తనాళాలు. ఇవి జల్లెడ లెక్క శరీరంలోని మలినాలను తొలగించి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. అలాగే రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును ఎప్పటి కప్పుడు తొలగిస్తాయి. అయితే రక్తనాళాల్లో కొవ్వును కరిగించేందుకు మనం చేయాల్సిందల్లా ఒక్కటే. పెద్ద ఎత్తున వ్యాయామాలుగట్రా చేయనవసరంలేదు. కేవలం ఈ ఒక్క పండును మితంగా తింటే చాలు. మన పని మనం చేసుకున్నట్లే దాని పని అది చేసుకుపోతుంది.
ఈ ఫలం పేరు కృష్ణఫలం. దీనినే ప్యాషన్ ఫ్రూట్ అంటారు. ఇవి డ్రైఫ్రూట్ జాతికి చెందినది. ఇందులో గింజలు ఎక్కువగా ఉంటాయి. గుర్తించడం ఎలా అనే సందేహం మీలో కలుగవచ్చు. ఇవి ఊదా, పసుపు రంగుల్లో ఉంటాయి. దీనిని రోజు మితంగా తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి ఫలం అందుబాటులో ఉంటే.. తొక్క తీసి నేరుగా తినేయవచ్చు. ఏదైనా మితంగా తింటే బాగుంటుంది. ఈ కృష్ణఫలం విషయంలోనూ అంతే. ఇందులో సహజమైన చక్కెరలు ఉంటాయి. ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. జీర్ణ సంబంధమైన ఇబ్బందులు తలెత్తుతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కొంత ఆలోచించి తినడమే మేలు. అదే మితంగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫైబర్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్-సి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..