
మార్నింగ్ వాకింగ్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైన వ్యాయామం. అందుకే చాలా మంది ఉదయాన్నే జిమ్ లేదా పార్క్లలో వాకింగ్కి వెళ్తుంటారు. ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో ప్రతిరోజూ 30 నిమిషాలు మార్నింగ్ వాక్ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను రెట్టింపు చేస్తుందట. కేలరీలు బర్న్ చేయడం నుంచి మానసిక ఆరోగ్యం వరకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే అరగంట పాటు నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
ఉదయం నిద్రలేచిన వెంటనే 30 నిమిషాలు నడవడం వల్ల ఒంట్లో శక్తి పెరుగుతుంది. దీంతో రోజంతా చురుకుగా ఉండటానికి వీలు కల్పిస్తుంది. మార్నింగ్ వాక్ మిమ్మల్ని రోజంతా అప్రమత్తంగా, శక్తివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఉదయం నిద్రలేచిన వెంటనే నడవడం వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మార్నింగ్ వాక్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది ఒత్తిడిని దూరంగా ఉంచుతుంది. ఉద్రిక్తత, ఆందోళనను తగ్గిస్తుంది. ఇది అలసట, నిరాశ సమస్యలను కూడా తొలగిస్తుంది.
మార్నింగ్ వాక్ అనేది ఒక సాధారణ వ్యాయామం. ఉదయం నిద్రలేచిన వెంటనే 30 నిమిషాలు నడవడం వల్ల 150 కేలరీలు ఖర్చవుతాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ప్రతి ఉదయం 30 నిమిషాలు నడవడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలపడుతుంది. మార్నింగ్ వాక్ శరీరమంతా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది.
మార్నింగ్ వాక్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే మార్నింగ్ వాక్ వల్ల శరీరంలోని చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.
ఉదయం 30 నిమిషాల నడక మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం అందిస్తుంది.
ఉదయం గాలి, వాతావరణం ప్రశాంతంగా, శుభ్రంగా ఉంటుంది. ఈ సమయంలో ముప్పై నిమిషాలు మార్నింగ్ వాక్ చేయడం వల్ల మెదడుకు మంచి ఆక్సిజన్ సరఫరా లభిస్తుంది. ఇది మీ జ్ఞాపకశక్తిని కూడా బలపరుస్తుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.