Lifestyle: ఎప్పుడూ నిరాశతో ఉంటున్నారా.? ఈ పండు తింటే నాలుగు రోజుల్లోనే..
అయితే తీసుకునే ఆహారం కూడా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఫుడ్ను డైట్లో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. తాజాగా చేసిన పరిశోధనల్లో దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నిత్యం దిగులు పడేవారు, నిరాశతో ఉండే వారు...
మారుతోన్న కాలంతో పాటు వ్యాధులు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు వ్యాధి అంటే కేవలం శారీరక వ్యాధులు మాత్రమే అనుకునే వారు కానీ ప్రస్తుతం రోజులు మారాయి. మానసిక వ్యాధులు సైతం ప్రజలను వేధిస్తున్నాయి. మారిన వర్క్ కల్చర్, పోటీ ప్రపంచంలో చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో మానసిక వైద్యులకు వద్దకు క్యూ కడుతున్నారు.
అయితే తీసుకునే ఆహారం కూడా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఫుడ్ను డైట్లో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. తాజాగా చేసిన పరిశోధనల్లో దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నిత్యం దిగులు పడేవారు, నిరాశతో ఉండే వారు తమ ఆహారంలో కివీని భాగం చేసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే మానసిక స్థితి మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నాఉ.
ప్రాణశక్తిని, మానసిక స్థిని కివీ మెరుగు పరుస్తున్నట్టు పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల మూడ్ను మార్చుకోవడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. అయితే ఈ ఫుడ్ ద్వారా ఆ ప్రభౄవం ఎంత త్వరగా ఉంటుందన్న దానిపై పరిశోధనలు నిర్వహించారు. ఇందుకోసం పరిశోధకులు విటమిన్ సి లోపం ఉన్నవారిని పరిగణలోకి తీసుకున్నారు.
అనంతరం వారిలో కొందిరకి విటమిన్ సీ ట్యాబ్లెట్స్తో పాటు మరికొందరు రోజుకు రెండు కివీ పండ్లను తీసుకోవాలని సూచించారు. వీరిని 8 వారాల తర్వాత పరిశీలించారు. కివీ పండ్లను తిన్నవారిలో నాలుగు రోజుల్లోనే మూడ్, ప్రాణశక్తి మెరుగవటం మొదలైందని కనుగొన్నారు. ఇక 14 నుంచి 16 రోజుల్లో గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు గుర్తించారు. అయితే విటమిన్ సి ట్యాబ్లెట్స్ వేసుకున్న వారిలో మాత్రం మార్పు అంత త్వరగా కనిపించలేదని తేలింది. ట్యాబ్లెట్స్ కంటే సహజంగా లభించే ఫుడ్స్ ద్వారా విటమనిస్ సి అందితేనే మానసిక ఆరోగ్యం మెరుగైనట్లు గుర్తించారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..