
నేటి జీవనశైలిలో ఆఫీసు పని, వర్క్ఫ్రం హోం, ఆన్లైన్ చదువులతో గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం సర్వసాధారణమై పోయింది. దీంతో నిరంతరం కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ ముందు కూర్చుంటున్నారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అలవాటును నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడి, వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల నడుము నొప్పి వస్తుంది. రక్త ప్రసరణ మందగించడం వల్ల చేతులు, కాళ్ళలో వాపు కూడా వస్తుందని డాక్టర్ అజయ్ కుమార్ అంటున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలను నివారించడానికి కొన్ని చిట్కాలను పాటించడం చాలా ముఖ్యం. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ రకమైన అలవాటు బరువు పెరగడం, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా జీవక్రియ మందగించడం వల్ల కేలరీలు సరిగ్గా ఖర్చు కాకపోవచ్చు. అదనంగా, నిరంతరం కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి దృష్టి సమస్యలు వస్తాయి. ఇది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. దీనివల్ల చంచలత్వం, పనిపై శ్రద్ధ తగ్గడం వంటివి కలుగుతాయని ఆయన అంటున్నారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.