
తుమ్మికూరకు ఉండే సహజమైన పులుపు పప్పుకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. పెద్దగా మసాలాలు అవసరం లేకుండానే ఇంట్లో లభించే సాధారణ పదార్థాలతో ఈ వంటకాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. వినాయక చవితి రోజు పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక కుటుంబ సభ్యులందరికీ రుచికరమైన సంప్రదాయ భోజనం అందించాలనుకుంటే ఈ తుమ్మికూర పప్పును తప్పకుండా ప్రయత్నించవచ్చు.
1. కావాల్సిన పదార్థాలు
కందిపప్పు – 1 కప్పు
తుమ్మికూర – 2 కప్పులు
ఉల్లిపాయ – 1
పచ్చిమిరపకాయలు – 3
టమాటా – 1
చింతపండు – కొద్దిగా
పసుపు – ¼ చెంచా
ఉప్పు – తగినంత
కారం – ½ చెంచా
నీరు – అవసరమైనంత
తాలింపు కోసం
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు – ½ చెంచా
జీలకర్ర – ½ చెంచా
ఎండుమిరపకాయలు – 2
వెల్లుల్లి – 4 రెబ్బలు
కరివేపాకు – కొద్దిగా
ఇంగువ – చిటికెడు
2. తుమ్మికూరను సిద్ధం చేసుకోవాలి
ముందుగా తుమ్మికూర ఆకులను శుభ్రంగా ఏరి, నీటితో బాగా కడగాలి. ఆకులకు అంటుకున్న మట్టి లేదా ఇతర మలినాలు లేకుండా ఒకటికి రెండుసార్లు నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి. అనంతరం తుమ్మికూరను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.
3. పప్పును ఉడికించాలి
కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. అందులో తరిగిన తుమ్మికూర, పసుపు, పచ్చిమిరపకాయలు, టమాటా, తగినంత నీరు వేసి ఉడికించాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత గరిటెతో బాగా కలపాలి.
4. పులుపు, కారం రుచి కలపాలి
ఇప్పుడు చింతపండును కొద్దిసేపు నానబెట్టి రసం తీసుకోవాలి. ఉడికిన పప్పులో చింతపండు రసం, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు పోసి పప్పును మీకు నచ్చిన చిక్కదనానికి తీసుకురావాలి. పప్పు బాగా మరిగే వరకు ఉంచాలి.
5. తాలింపు వేయాలి
చివరగా ఒక చిన్న పాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ తాలింపును వేడి వేడి తుమ్మికూర పప్పులో వేసి బాగా కలపాలి.
6. వేడి అన్నంతో సర్వ్ చేయండి
అంతే.. రుచికరమైన తుమ్మికూర పప్పు సిద్ధం. వేడి వేడి అన్నంలో ఈ పప్పును వేసుకుని కొద్దిగా నెయ్యి కలుపుకుని తింటే పుల్లటి, కమ్మటి రుచితో భలే ఉంటుంది. వినాయక చవితి పండుగ భోజనంలో ఈ సంప్రదాయ పప్పును కూడా చేర్చుకోవచ్చు.