పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.? పొరపాటున కూడా ఇలా చేయకండి..!
అంతేకాదు.. పెరుగు తిన్న వెంటనే పండ్లు, చేపలు, గుడ్లు, వేయించిన ఆహారాలు, ఊరగాయలు, టీ, కాఫీ, ఉల్లిపాయలు తినకూడదని చెబుతున్నారు. పెరుగు తిన్న తర్వాత కనీసం అరగంట సేపు నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. పెరుగును సాయంత్రం, రాత్రి సమయంలో తినకూడదు. తింటే జలుబు, దగ్గు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో పెరుగు తినడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో పెరుగును సూపర్ ఫుడ్స్ చెబుతారు. పెరుగులో కాల్షియం, లాక్టిక్ ఆమ్లం, విటమిన్ బి12 వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అయితే పెరుగు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? పెరుగు తిన్న వెంటనే నీరు తాగడం హానికరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది కడుపు ఆమ్లాన్ని పలుచన చేస్తుందని అంటున్నారు. పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు నొప్పి, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ప్రోబయోటిక్ లక్షణాలు తగ్గిపోతాయి. దీంతో పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు తగ్గిపోతాయని చెబుతున్నారు. అందుకే ఆహారం తినే సమయంలో పెరుగు తినండి, వెంటనే నీళ్లు తాగకండి అని చెబుతున్నారు.. అంతేకాదు.. పెరుగు తిన్న వెంటనే పండ్లు, చేపలు, గుడ్లు, వేయించిన ఆహారాలు, ఊరగాయలు, టీ, కాఫీ, ఉల్లిపాయలు తినకూడదని చెబుతున్నారు. పెరుగు తిన్న తర్వాత కనీసం అరగంట సేపు నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. పెరుగును సాయంత్రం, రాత్రి సమయంలో తినకూడదు. తింటే జలుబు, దగ్గు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
పెరుగులో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి వేసవిలో ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగు విటమిన్ సి కి మంచి మూలం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. పెరుగుని తినడం వల్ల సీజనల్ వ్యాధులను నివారించవచ్చు. రోగనిరోధక శక్తి కోసం రోజూ కాల్షియం అధికంగా ఉండే పెరుగు తినడం ద్వారా మీ ఎముకలను బలోపేతం చేసుకోవచ్చు. ఎముకలు బలహీనపడకుండా నిరోధించడంలో పెరుగు సహాయపడుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








