
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు వీకెండ్స్లోనే వారానికి సరిపడా మాంసాహారాన్ని కొనుగోలు చేసి ఫ్రిజ్లో నిల్వ చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఈ సౌకర్యం వెనుక పొంచి ఉన్న అనారోగ్య ముప్పుల గురించి పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పచ్చి మాంసాన్ని ఫ్రిజ్లో ఉంచిన 48 గంటల తర్వాత అది తన సహజమైన పోషక విలువలను కోల్పోవడం ప్రారంభిస్తుంది. కేవలం పోషకాలు పోవడమే కాకుండా అది బ్యాక్టీరియా వృద్ధికి ప్రధాన కేంద్రంగా మారుతుంది. కొనుగోలు చేసిన రెండు రోజుల్లోపు మాంసాన్ని వండుకోవడమే ఆరోగ్యానికి అత్యంత సురక్షితం.
ఒకవేళ మీరు మాంసాన్ని నిల్వ చేయక తప్పని పరిస్థితి ఉంటే ఈ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు..
మీరు నిల్వ ఉంచిన మాంసంలో ఈ మార్పులు కనిపిస్తే వెంటనే పారేయండి..
కలుషితమైన లేదా ఎక్కువ రోజులు నిల్వ ఉన్న మాంసాన్ని తీసుకోవడం వల్ల తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. ఇది వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి మాత్రమే కాకుండా, దీర్ఘకాలంలో జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..