కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ లడ్డూలు దివ్య ఔషధం..! ఎలా తయారుచేయాలో తెలుసుకోండి..

Fenugreek Laddu: శీతాకాలంలో ప్రజలు తరచుగా పిండి, బెల్లం, నువ్వులు మొదలైన వాటితో తయారుచేసిన లడ్డూలను తింటారు. కానీ ఈ రోజు మెంతి గింజలతో

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ లడ్డూలు దివ్య ఔషధం..! ఎలా తయారుచేయాలో తెలుసుకోండి..
Fenugreek Laddu

Updated on: Jan 06, 2022 | 12:15 PM

Fenugreek Laddu: శీతాకాలంలో ప్రజలు తరచుగా పిండి, బెల్లం, నువ్వులు మొదలైన వాటితో తయారుచేసిన లడ్డూలను తింటారు. కానీ ఈ రోజు మెంతి గింజలతో తయారు చేసే లడ్డూల గురించి తెలుసుకుందాం. ఈ లడ్డూలు తినడానికి రుచికరంగా ఉంటాయి అంతేకాకుండా ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. ప్రసవం అయిన తర్వాత ఈ లడ్డూలను తల్లికి తినిపిస్తే, అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మరోవైపు కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి సమస్యలున్న వారికి చలికాలంలో మెంతికూర లడ్డూలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఇంట్లోని పెద్దలకు ఈ లడ్డూలను తినిపిస్తే వారి శరీరం వెచ్చదనంతో పాటు అన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ లడ్డూలను ఇంట్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు
1. మెంతి గింజలు – 100 గ్రాముల
2. పాలు – అర లీటరు పాలు
3. గోధుమ పిండి – 300 గ్రాములు
4. నెయ్యి – 250 గ్రాముల
5. బాదం – 30-35 గ్రాములు
6. ఎండుమిర్చి – 8-10
7. జీలకర్ర పొడి – 2 టీస్పూన్లు
8. పొడి అల్లం పొడి – 2 టీస్పూన్లు
9. చిన్న యాలకులు – 10- 12
10. దాల్చిన చెక్క – 4 ముక్కలు
11. జాజికాయ – 2
12. బెల్లం – 300 గ్రాములు

తయారుచేసే విధానం
ముందుగా మెంతి గింజలను బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత కడిగి కాటన్ క్లాత్‌పై వేసి ఎండలో ఆరబెట్టాలి. తర్వాత మిక్సీలో వేసి ముతకగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత పాలను మరిగించి అందులో మెంతిపేస్ట్‌ వేయాలి. 8 నుంచి 10 గంటలు నానబెట్టాలి. ఇప్పుడు బాదంపప్పును చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండుమిర్చి, పప్పు చక్కెర, జాజికాయను మెత్తగా చూర్ణం చేసుకోవాలి. ఏలకుల పొడి కూడా కలపాలి. ఇప్పుడు బాణలిలో అరకప్పు నెయ్యి వేసి నానబెట్టిన మెంతుల పేస్ట్‌ వేసి మీడియం మంట మీద లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. బాణలిలో మిగిలిన నెయ్యి వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో పిండి వేసి కలపాలి.

తరువాత పాన్లో ఒక చిన్న చెంచా నెయ్యి వేసి, బెల్లం ముక్కలను వేసి, వాటిని కరిగించాలి. తరువాత బెల్లం సిరప్‌లో జీలకర్ర పొడి, పొడి అల్లం పొడి, తరిగిన బాదం, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, జాజికాయ, యాలకులు వేసి బాగా కలపాలి. చివరగా మెంతిపేస్ట్‌, వేయించిన పిండిని కలపాలి. ఇప్పుడు వేయించిన మెంతులు, వేయించిన పిండి మిశ్రమాన్ని చేతులతో బాగా కలపాలి. ఈ మిశ్రమం నుంచి గుండ్రని లడ్డూలను సిద్ధం చేసి గాలి చొరబడని కంటైనర్‌లో నింపాలి. అంతే మెంతుల లడ్డులు రెడీ అయిపోయాయి.

అత్తిపండ్లు అధికంగా తింటే హానికరమే..! ఈ సమస్యలున్నవారు అస్సలు తినకూడదు..

CSIR UGC NET అభ్యర్థులకు గమనిక.. కరెక్షన్ విండో ఓపెన్ చేసిన NTA.. జనవరి 9 వరకు మార్పులకు అవకాశం..

ప్రపంచంలో ఇలాంటి హోటల్స్ కూడా ఉంటాయా..! ఒక్కరాత్రికి బస చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..