Health Tips: ఈ ఆహారాలు అతిగా తింటే డిప్రెషన్ ప్రమాదం పెరిగినట్లే.. దూరంగా ఉంటే బెటర్..

|

Sep 18, 2022 | 8:32 PM

Depression Myths: తినడం వల్ల డిప్రెషన్ తగ్గుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అటువంటి అనేక ఆహారాలు ఉన్నాయి, ఇది డిప్రెషన్ సమస్యను మరింత పెంచుతుంది. ఈ ఆహారాల గురించి ఇక్కడ మేము మీకు చెప్పబోతున్నాం.

Health Tips: ఈ ఆహారాలు అతిగా తింటే డిప్రెషన్ ప్రమాదం పెరిగినట్లే.. దూరంగా ఉంటే బెటర్..
Depression Myths Unhealthy Fast Food
Follow us on

Symptoms Of Depression: ఒత్తిడికి లోనవడం ప్రస్తుతం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే, ఒత్తిడిని సకాలంలో తగ్గించుకోకపోతే, అది డిప్రెషన్‌కు దారి తీస్తుంది. నిరాశకు కారణాలు చాలా ఉండవచ్చు. కానీ, ఫలితం మాత్రం మానసిక ఆరోగ్యంపై పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మంచి నిద్ర, సరైన ఆహారం ఈ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు. తినడం వల్ల డిప్రెషన్ నయం అవుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, కొన్ని ఆహారాలు, పానీయాల వినియోగాన్ని తగ్గించడం లేదా ఆపడం వల్ల పెద్ద మార్పు వస్తుందని మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అటువంటి అనేక ఆహారాలు ఉన్నాయి. ఇవి డిప్రెషన్ సమస్యను మరింత పెంచుతాయి. ఈ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఫాస్ట్ ఫుడ్..

ఇవి కూడా చదవండి

ఒత్తిడి లేదా డిప్రెషన్‌తో బాధపడేవారికి ఆహారపు అలవాట్లు ఎక్కువగా ఇబ్బంది పెడతాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. వారి కోరికలను తగ్గించుకోవడానికి, అలాంటి ఆహారాన్ని తింటుంటారు. ఇది శరీరానికి హాని కలిగిస్తుంది. ఫాస్ట్ ఫుడ్ రుచికరంగా ఉండవచ్చు. కానీ, ఇందులో కృత్రిమ ట్రాన్స్ ఫ్యాట్, శుద్ధి చేసిన పిండి పదార్థాలు, చక్కెర ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినే వారు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. ఫ్రై మోమోస్, బర్గర్, పిజ్జా వంటి ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి.

మద్యం..

తమకు ఏదైనా బాధ కలిగినప్పుడు చాలా మంది మద్యపానాన్ని తమ భాగస్వామిగా చేసుకుంటారు. ఆల్కహాల్ నిద్రపోయేలా చేయవచ్చు. కానీ, అది మీ డిప్రెషన్‌ను మరింత పెంచుతుంది. డిప్రెషన్‌తో బాధపడేవారు పొరపాటున కూడా మద్యం సేవించకూడదు. ఆల్కహాల్ శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుందని, దీని కారణంగా ఒకరి మానసిక స్థితి చెడ్డదని ఒక పరిశోధన వెల్లడించింది.

శుద్ధి చేసిన ధాన్యాలు..

ధాన్యాల వినియోగం శరీరానికి మేలు చేసినా కొందరికి శుద్ధి చేసిన ధాన్యాలు తినడం అలవాటు. వాటిని శుద్ధి చేయడం వల్ల వాటిలోని పోషకాలు తొలగిపోతాయని చెబుతున్నారు. శుద్ధి చేసిన ధాన్యాలను తినే వ్యక్తులు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉందని పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. తృణధాన్యాలు అంటే బార్లీ, గోధుమలు, శనగలను ప్రాసెస్ చేయకుండా తీసుకుంటే మంచిది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే. TV9 తెలుగు వీటిని ధృవీకరించలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ పద్ధతులు, చిట్కాలు పాటించాలి.