AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: మహ్మద్ షమీ తర్వాత మరో భారత బౌలర్ ఔట్.. కారణం ఏంటంటే?

IND vs AUS: ఆస్ట్రేలియాతో జరిగే 3-మ్యాచ్‌ల T20 సిరీస్‌ నుంచి మహ్మద్ షమీ నిష్క్రమించి 24 గంటలు కూడా కాలేదు. అంతలోనే ఇండియా A జట్టు నుంచి ఒక ఫాస్ట్ బౌలర్ ఔట్ అయ్యాడు.

Team India: మహ్మద్ షమీ తర్వాత మరో భారత బౌలర్ ఔట్.. కారణం ఏంటంటే?
Ind Vs Nz Navdeep Saini
Venkata Chari
|

Updated on: Sep 18, 2022 | 2:35 PM

Share

India A Team: భారత బౌలర్లకు అంతగా లక్ కలసి రావడం లేదు. ప్రస్తుతం పరిస్థితులుకు వారికి అనుకూలంగా లేనట్లు తెలుస్తోంది. అందుకే ఒకరి తర్వాత మరొకరు బౌలర్లు జట్టును వీడుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగే 3-మ్యాచ్‌ల T20 సిరీస్‌కు మహ్మద్ షమీ నిష్క్రమించి 24 గంటలు కూడా కాకముందే, ఇండియా A జట్టు నుంచి ఒక ఫాస్ట్ బౌలర్ ఔట్ అయ్యాడనే వార్తలు కూడా వచ్చాయి. భారత్ ఎ జట్టు నుంచి తప్పుకున్న బౌలర్ పేరు నవదీప్ సైనీ.

గజ్జల్లో గాయంతో ఇబ్బందులు..

బీసీసీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం నవదీప్ సైనీకి గజ్జల్లో గాయం తేలింది. దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్, నార్త్ జోన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. దీని తర్వాత, అతను దులీప్ ట్రోఫీ నుంచి, న్యూజిలాండ్‌తో జరిగిన ఇండియా A సిరీస్ నుంచి కూడా నిష్క్రమించాడు.

సైనీ పునరావాసం కోసం NCA బాట..

గజ్జల్లో గాయం నుంచి కోలుకోవడానికి సైనీ ఇప్పుడు ఎన్‌సీఏకు వెళ్లనున్నాడని, అక్కడ అతను పునరావాసం చేస్తాడని బీసీసీఐ తెలిపింది. ఇది కాకుండా, నవదీప్ సైనీకి బదులుగా రిషి ధావన్‌ను ఇండియా ఎ జట్టులోకి తీసుకోవడం గురించి కూడా బోర్డు సమాచారం ఇచ్చింది.

ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో షమీ స్థానంలో ఉమేష్‌..

నవదీప్ సైనీ గాయం కారణంగా వైదొలగడానికి ముందు, భారత సీనియర్ జట్టు నుంచి ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నిష్క్రమించాడు. షమీకి కరోనా సోకడంతో ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతని స్థానంలో ఉమేష్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ధృవీకరించింది.

సెప్టెంబర్ 20 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ మొహాలీలో జరగనుంది. రెండో మ్యాచ్ నాగ్‌పూర్‌లో సెప్టెంబర్ 23న, మూడో, చివరి మ్యాచ్ సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో జరగనుంది.

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే