
బక్రీద్ రోజున ముజఫ్ఫర్ రెసిపీని చేయండి. బక్రీద్ పండుగను ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున బక్రీద్ వేడుకలను మరింత మధురం చేయడానికి రుచికరమైన ముజఫ్ఫర్ రెసిపీ ఉంది. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా సన్నని సేమ్యాను తీసుకోండి. ఇప్పుడు స్టౌవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అది వేడయ్యాక అందులో సేమ్యాను వేసి గోధుమ రంగులోకి మారే వరకు నెయ్యి లేకుండా వేయించండి. వేగిన తర్వాత కడాయి నుంచి తీసి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు ఒక పాత్రలో చక్కెర, నీరు, పాలు, నిమ్మరసం వేసి మరిగించండి. మరిగిన తర్వాత మంట తగ్గించి సుమారు 20 నిమిషాలు మెల్లగా ఉడికించండి. పైన వచ్చే నురగను తీసివేసి ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోండి. మరో పాత్రలో కొంచెం నీళ్లు మరిగించి తీసి ఆ నీళ్లలో కుంకుమపువ్వును కొద్దిగా గరిటెడు పాలలో నానబెట్టి వేసుకోండి.
వేయించిన సన్నని సేమ్యాను ఒక పలుచని బట్టలో పెట్టి ఈ కుంకుమపువ్వు నీళ్లలో 2 నుంచి 3 సార్లు ముంచండి. సన్నని సేమ్యా మృదువుగా అయ్యిందో లేదో చూసుకోండి. మృదువైన సన్నని సేమ్యాను బయటకు తీసి ఫోర్కులతో విడగొట్టి ఉండలు లేకుండా చేయండి. అందులో కరిగిన నెయ్యి చల్లి కుంకుమపువ్వు నీటిని వడకట్టి సన్నని సేమ్యా తో బాగా కలిపి ఉంచండి.
ఈ సన్నని సేమ్యా మిశ్రమాన్ని.. గులాబ్ జల్ కేవ్రా కలిపిన చక్కెర నీటి పాత్రలో వేసి మళ్లీ మరిగించండి. పాత్రను అల్యూమినియం ఫాయిల్ తో పూర్తిగా కప్పి పైన మూత పెట్టండి. దమ్ మీద సుమారు 15 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత మూత తీసి వంటకాన్ని ప్లేట్ లోకి మార్చండి. చివరగా తురుముకున్న ఖోవా, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం అలంకరించి వడ్డించండి.