AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

అయితే పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో. పండ్లున తిన్న వెంటనే నీటిని తాగితే అంతకంటే ఎక్కువ నష్టం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల పండ్లను తిన్న వెంటనే నీటిని తాగితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి పండ్లను తీసుకున్న తర్వాత నీటిని తాగితే ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
Drinking Water
Narender Vaitla
|

Updated on: Apr 20, 2024 | 10:22 AM

Share

పండ్లు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు పండ్లతో చెక్‌ పెట్టొచ్చని చెబుతారు. ముఖ్యంగా సీజనల్‌ ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయొచ్చని సూచిస్తుంటారు.

అయితే పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో. పండ్లున తిన్న వెంటనే నీటిని తాగితే అంతకంటే ఎక్కువ నష్టం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల పండ్లను తిన్న వెంటనే నీటిని తాగితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి పండ్లను తీసుకున్న తర్వాత నీటిని తాగితే ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* యాపిల్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే యాపిల్‌ తిన్నవెంటనే నీళ్లు తాగితే మాత్రం మంచిది కాదు. దీనివల్ల కడుపునొప్పి, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అలాగే జీర్ణక్రియపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అజీర్ణం, గ్యాస్ సమస్యలు వస్తాయి.

* అరటి పండు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసిందే. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే అరటి పండు తినగానే నీరు తాగితే.. అది జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి. అలాగే బ్లడ్‌ షుగర్‌పై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

* నీటిశాతం అధికంగా ఉండే పుచ్చకాయ తిన్న తర్వాత నీరు తాగితే కూడా ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్