
రిషి అనే బాలుడు తన వయస్సుకి మించిన ఆన్లైన్ చర్చల్లో పాల్గొంటూ, నిజ ప్రపంచానికి దూరమైపోయాడు. పాఠశాలకు వెళ్లడం మానేసి, తల్లిదండ్రులపైనే భౌతిక దాడికి దిగే స్థాయికి ఆ బాలుడిని సోషల్ మీడియా ఎలా మార్చింది? AIIMS ఢిల్లీ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ యతన్ పాల్ సింగ్ బల్హారా విశ్లేషణ ప్రకారం.. డిజిటల్ కర్ఫ్యూలు ఎందుకు అవసరమో, మన పిల్లలను ఈ నరకం నుండి ఎలా బయటపడేయాలో ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం..
1. మల్టీప్లేయర్ గేమ్స్ నుండి సోషల్ మీడియాకు:
చాలా మంది పిల్లలు మొదట ఆన్లైన్ గేమింగ్ ద్వారా చాట్ ఫీచర్లకు అలవాటు పడుతున్నారు. ఆ తర్వాత అవి సోషల్ మీడియా గ్రూపులుగా మారి, అపరిచితులతో గంటల తరబడి మాటలకు దారితీస్తున్నాయి. రిషి విషయంలో కూడా ఇదే జరిగింది.
2. వయస్సుకి మించిన ప్రవర్తన :
సోషల్ మీడియాలో ‘పెద్దవాళ్లలా కనిపించడం’ గొప్ప అని భావించే పిల్లలు, తమ వయస్సుకి సరిపోని చర్చల్లో పాల్గొంటున్నారు. దీనివల్ల వారిలో విచక్షణ జ్ఞానం దెబ్బతిని, నిజజీవితంలో ఒంటరిగా మారిపోతున్నారు.
3. ప్రతికూల ప్రవర్తన మార్పులు:
డిజిటల్ వ్యసనానికి గురైన పిల్లల్లో ఈ క్రింది మార్పులు కనిపిస్తాయి:
స్కూలుకు వెళ్లడానికి నిరాకరించడం చదువులో వెనుకబడటం.
కుటుంబ సభ్యులతో మాట్లాడటం మానేసి, ఫోన్ తీసుకుంటే తీవ్రమైన కోపం మరియు దూకుడు ప్రదర్శించడం.
లైకులు, కామెంట్ల కోసం అతిగా ఆరాటపడటం.
4. డిజిటల్ కర్ఫ్యూ ఆవశ్యకత:
ప్రభుత్వాలు ఆలోచిస్తున్న డిజిటల్ కర్ఫ్యూలు పిల్లలకు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సహజమైన జీవితాన్ని గడపడానికి సహాయపడతాయని డాక్టర్ బల్హారా సమర్థించారు. ఇది కేవలం నిషేధం కాదు, పిల్లల మెదడును వ్యసనం నుండి రక్షించే ప్రయత్నం.
5. తల్లిదండ్రుల కోసం పరిష్కారాలు:
పిల్లలకు స్క్రీన్ టైమ్ ను పరిమితం చేయాలి.
టెక్నాలజీని నేర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించేలా ప్రోత్సహించాలి.
పిల్లలతో ఎక్కువ సమయం గడపడం ద్వారా వారి డిజిటల్ ఒంటరితనాన్ని పోగొట్టాలి.