వనపర్తి జిల్లా మూలమల్ల గ్రామ చెరువు కట్టపై మొసలి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. రైతులు, కూలీలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని పొలాలకు వెళ్తున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా చర్యలు లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రక్షణ కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.