
కొన్ని వారాలుగా చైనాలోని వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వేల సంఖ్యలో అకౌంట్లను సస్పెండ్ చేయడం లేదా రివ్యూలో ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ టిప్స్, మెడికల్ అడ్వైస్, హెల్త్ హ్యాక్స్ మరియు ఎడ్యుకేషన్ వంటి సున్నితమైన అంశాలపై ఎలాంటి గుర్తింపు పొందిన డిగ్రీలు లేదా వృత్తిపరమైన లైసెన్స్లు లేకుండా సమాచారం పంచుకునే వారిని ప్రభుత్వం టార్గెట్ చేసింది.
చైనాకు చెందిన ‘సైబర్స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా’ (CAC) ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం.. హెల్త్కేర్, ఫైనాన్స్, లా (న్యాయశాస్త్రం), విద్య వంటి స్పెషలైజ్డ్ రంగాల గురించి మాట్లాడే ఇన్ఫ్లుయెన్సర్లు తప్పనిసరిగా తమ అర్హతలను నిరూపించుకోవాలి.
తప్పుడు సమాచారం వల్ల ప్రజలకు కలిగే ఆర్థిక నష్టాలు మరియు ఆరోగ్య సమస్యలను అరికట్టడమే ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. చాలా మంది యువత ఇన్ఫ్లుయెన్సర్ల మాటలను గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టడం లేదా అనారోగ్యకరమైన హెల్త్ టిప్స్ పాటించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఆన్లైన్ సమాచారం యొక్క విశ్వసనీయతను పెంచడం ద్వారా యూజర్ల ప్రయోజనాలను కాపాడాలని రెగ్యులేటర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
చైనా యొక్క ఈ చర్య ‘క్వింగ్లాంగ్’ వంటి ప్రక్షాళన ప్రచారాలలో ఒక భాగం. ఇది ఆన్లైన్ స్పేస్ను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుందని కొందరు వాదిస్తుంటే, ఇది కంటెంట్ క్రియేటర్లపై నియంత్రణను పెంచుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా, నిపుణులైన వారు మాత్రమే సలహాలు ఇవ్వాలనే ఈ నిబంధన క్రియేటర్ ఎకానమీలో పెద్ద మార్పులకు దారితీస్తోంది.