
Chanakya Niti: భారత ఆర్థికశాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రం ద్వారా అనేక మానవ సమస్యలకు పరిష్కారం చూపారు. ఒక వ్యక్తి ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే విషయాలను తెలియజేశారు. ఒక వ్యక్తి బయటి శత్రువులతో ఎంతైనా పోరాడవచ్చని.. అయితే అంతరంగా ఉండే శత్రువులను గుర్తించడం చాలా కష్టమని తెలిపారు. తరచుగా మన స్వభావం కారణంగానే ప్రజలు మనకు దగ్గరవడం లేదా దూరమవడం జరుగుతుంది. అందుకే వ్యక్తి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మనం రోజుకు ఒక్కసారైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చాణక్యుడు సూచిస్తున్నారు. మీ స్వంత చేతులతో మీ జీవితాన్ని నాశనం చేసే కొన్ని విషయాలు ఉన్నాయని చాణక్యుడు చెప్పారు. కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం.
మనకు ఏది సరైనది? ఏది కాదు? అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం మంచికి చెడుకి మధ్య తేడాను అర్థం చేసుకోకపోతే.. అది మన జీవిత పతనానికి దారితీస్తుంది. ఒక వ్యక్తి త్వరలోనే చెడు మలుపు తీసుకుంటాడు. దాని కారణంగా అతను తన జీవితంలో చాలా బాధపడతాడు అని చాణక్యుడు స్పష్టం చేశారు.
చాణక్యుడు జీవితంలో ఎప్పుడూ గర్వపడకూడదని స్పష్టం చేశారు. ఎందుకంటే అహంకారం ఎప్పుడూ మంచి చేయదు. మీరు దేని గురించి అయినా అహంకారంతో ఉంటే… మీరు తరచుగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి, ఒక వ్యక్తికి ఆత్మగౌరవం ఉండాలి కానీ.. అహంకారంగా ఉండకూడదు.
మీ కంటే పెద్ద వాళ్లను ఎప్పుడూ అవమానించకండి.. ఎందుకంటే వారి అనుభవం మీ కంటే గొప్పది. వారి జ్ఞానాన్ని గౌరవించండి, దాని నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించండి అని చాణక్యుడు సూచిస్తున్నారు.
చాణక్యుడి ప్రకారం.. కష్టపడి పనిచేయకుండా విజయానికి ప్రత్నాయం లేదు. కాబట్టి జీవితంలో విజయం సాధించడానికి ఎప్పుడూ సత్వరమార్గాలను ఉపయోగించవద్దు. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది.
మానవ జీవితంలో డబ్బుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. డబ్బు వృధా చేసే వ్యక్తులు వారి తర్వాతి జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కుంటారని చాణక్యుడు స్పష్టం చేశారు. అందుకే డబ్బు జాగ్రత్త ఖర్చు చేయాలని సూచిస్తున్నారు.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం చాణక్యుడి నీతి శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9 తెలుగు ధృవీకరించదు.)