Calcium Deficiency: శరీరంలో కాల్షియం లోపిస్తే ఏమౌతుందో తెలుసా? హార్ట్‌ స్ట్రోక్‌, క్యాన్సర్‌ ఇంకా..

మన ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్‌, ఇతర పోషకాలు చాలా అవసరం. వాటిల్లో కాల్షియం చాలా ముఖ్యమైన ఖనిజం. శరీర అవయవాల పెరుగుదలకు కాల్షియం పాత్ర..

Calcium Deficiency: శరీరంలో కాల్షియం లోపిస్తే ఏమౌతుందో తెలుసా? హార్ట్‌ స్ట్రోక్‌, క్యాన్సర్‌ ఇంకా..
Calcium Deficiency
Follow us

|

Updated on: Jul 28, 2022 | 9:31 PM

Calcium Deficiency Symptoms and Causes in telugu: మన ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్‌, ఇతర పోషకాలు చాలా అవసరం. వాటిల్లో కాల్షియం చాలా ముఖ్యమైన ఖనిజం. శరీర అవయవాల పెరుగుదలకు కాల్షియం పాత్ర కీలకమైనది. ఇది ఎముకలను బలపరచడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కాల్షియం చాలా ముఖ్యం. కాల్షియం స్థాయిలు వయస్సుల వారీగా మారుతుంటుంది. శరీరంలో దీని అవసరం అప్పుడే పుట్టిన శిశువు దగ్గరి నుంచి ముసలివాళ్ల వరకు మారుతూ ఉంటుంది. ఎముకలు, గోళ్లను బలోపేతానికి, నరాలు, కండరాలు, గుండె ఆరోగ్యాన్ని కాల్షియం మెరుగుపరుస్తుంది. మహిళల్లో పీరియడ్స్ సక్రమంగా రావడానికి కూడా కాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మహిళల్లో కాల్షియం లోపం తలెత్తితే మెనోపాజ్ సమయంలో అనేక అనారోగ్య సమస్యలను సృష్టిస్తుంది.

శరీరంలో కాల్షియం లోపిస్తే ప్రధానంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి.. ఎముకల బలహీనత, ఎముకల్లో నొప్పులు, కండరాల నొప్పులు, కాళ్లలో తిమ్మిరి, కాళ్లలో జలదరింపు, జ్ఞాపకశక్తి క్షీణత, మహిళల్లో రుతుక్రమ సమస్యలు వంటి ప్రధాన లక్షణాలు. శరీరంలో కాల్షియం లోపిస్తే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి ఉన్నవారిలో ఎముకలు సన్నబడి బలహీనంగా మారతాయి. ఎముక విరిగిపోయే అవకాశం కూడా ఉంది. శరీరంలో కాల్షియం లోపిస్తే పేగుల్లో కణితులు ఏర్పడి.. పెద్దప్రేగు క్యాన్సర్‌కు దారి తీస్తుంది. మహిళలు వయస్సు పెరిగే కొద్దీ కాల్షియం లోపాన్ని అధిగమించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. కాల్షియం లోపిస్తే గుండె జబ్బులకు కూడా దారితీస్తుంది. శరీరంలో తగినంత కాల్షియం ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు నివారిస్తుంది. శరీరంలో కాల్షియం లోపిస్తే బీపీ వస్తుంది. అధిక రక్తపోటు స్ట్రోక్‌కు దారి తీస్తుంది.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు