AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖను దేశంలో, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా టైర్ వన్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం: విజయసాయి రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పాలనా రాజధానిగా మారిన క్రమంలో విశాఖలో పారిశ్రామిక అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టినట్లు చెప్పారు. త్వరలోనే మరిన్ని విధానాలను తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు. విశాఖను దేశంలో, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. విశాఖను టైర్ వన్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయి వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు వైసీపీ ప్రభుత్వం […]

విశాఖను దేశంలో, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా టైర్ వన్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం: విజయసాయి రెడ్డి
Venkata Narayana
|

Updated on: Nov 21, 2020 | 9:13 PM

Share

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పాలనా రాజధానిగా మారిన క్రమంలో విశాఖలో పారిశ్రామిక అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టినట్లు చెప్పారు. త్వరలోనే మరిన్ని విధానాలను తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు. విశాఖను దేశంలో, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. విశాఖను టైర్ వన్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయి వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు వైసీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పుకొచ్చారు. విశాఖపట్నానికి లోకేషన్, లేబర్ అవైలబుల్టీ అడ్వాంటేజ్‌గా ఉందన్నారు. పోర్ట్ సిటీ అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంక్ పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే కేంద్రం నుంచి పెట్రోలియం ట్రైబల్ యూనివర్సిటీలు వస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 11 శాతం ఎఫ్‌డీఐలు రాబోతున్నాయని.. విశాఖ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని విజయసాయిరెడ్డి అన్నారు.