వైఎస్ఆర్ వాహనమిత్ర.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ..

|

Jun 04, 2020 | 1:35 PM

వైఎస్ఆర్ వాహనమిత్ర పధకానికి సంబంధించి రెండో విడత సొమ్మును ఇవాళ లబ్దిదారుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పధకం ద్వారా మొత్తం 2,62,493 మందికి..

వైఎస్ఆర్ వాహనమిత్ర.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ..
Vahanamitra
Follow us on

వైఎస్ఆర్ వాహనమిత్ర పధకానికి సంబంధించి రెండో విడత సొమ్మును ఇవాళ లబ్దిదారుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒకేసారి డబ్బులను జమ చేయనున్నారు. ఈ పధకం ద్వారా మొత్తం 2,62,493 మందికి రూ. 262.49 కోట్ల ఆర్ధిక సాయం అందించనుండగా.. సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా రూ. 10 వేలు చొప్పున జమ కానున్నాయి.

గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా 37,756 మంది లబ్దిదారుల జాబితాలో చేరారు. ఇకపోతే గతేడాది సెప్టెంబర్ 23 నుంచి ఈ ఏడాది మే 16 మధ్య కొత్తగా వాహనాలు కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారికి కూడా ఈ పధకాన్ని వర్తింపజేశారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ వాహనమిత్ర పధకంకు సంబంధించి లబ్దిదారుల జాబితాలో అత్యధికంగా బీసీలే ఉన్నారు. మొత్తం లబ్దిదారుల్లో 1,17,096 మంది బీసీలు ఉండగా.. ఎస్సీలు 61,390, ఈబీసీలు 14,592, కాపులు 29,643, ఎస్టీలు 10,049, మైనార్టీలు 28,118, బ్రాహ్మణులు 581, క్రైస్తవులు 1,026 ఉన్నారు. కాగా, ఈ పధకం కింద లబ్దిదారులకు ప్రతీ ఏటా ప్రభుత్వం పది వేలు సాయం చేయనుంది.

Also Read:

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

కోనసీమలో కరోనా టెర్రర్.. ఆ ఒక్కడి వల్లే 157 మంది సోకింది..

షాకింగ్: భారత్‌లో 198 రకాలుగా కరోనా రూపాంతరం!