మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం జగన్ గారిని ఉద్దేశించి విధి క్రూరమైందని ఏదో అనబోయి ఎందుకు ఆగావు ఉమా.? చేతబడి గాని మొదలుపెట్టావా ఏంటి..? మంత్రిగా పనిచేస్తూ మీ అన్న రమణ రైలు ప్రమాదంలో మరణించారు. మీ వదిన గారిది సహజ మరణం కాదంటారు. దుర్మార్గాలతో ఈ స్థాయికి చేరావంటే విధి ఎంత దయలేనిదో తెలియటం లేదా..? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.