బీజేపీపై శివసేన అటాక్!

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన అప్పుడే దాడి మొదలుపెట్టింది. శివసేన ‘సామ్నా’ పత్రికలో మోదీ ప్రభుత్వాన్ని దుయ్య‌బట్టింది. నిరుద్యోగ సమస్యపై నిలదీసింది. నిరుద్యోగ యువతలో ధైర్యాన్ని నింపేందుకు నాలుగు మాటలు చెప్పడం వల్ల, ప్రకటనలు ఇవ్వడం వల్ల ఉద్యోగాల కల్పన జరగదని విరుచుకుపడింది. అంతేకాదు, బుల్లెట్ రైలు ప్రాజెక్టు కూడా ఉద్యోగావకాశాలను అందివ్వలేదని తేల్చి చెప్పింది. ప్రధాన మంత్రి కౌశల్య వికాశ్ యోజన పథకంపై ప్రశ్నల వర్షం కురిపించింది. మోదీ రెండోసారి ఎన్నికయ్యాక […]

బీజేపీపై శివసేన అటాక్!

Edited By:

Updated on: Jun 03, 2019 | 9:03 PM

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన అప్పుడే దాడి మొదలుపెట్టింది. శివసేన ‘సామ్నా’ పత్రికలో మోదీ ప్రభుత్వాన్ని దుయ్య‌బట్టింది. నిరుద్యోగ సమస్యపై నిలదీసింది. నిరుద్యోగ యువతలో ధైర్యాన్ని నింపేందుకు నాలుగు మాటలు చెప్పడం వల్ల, ప్రకటనలు ఇవ్వడం వల్ల ఉద్యోగాల కల్పన జరగదని విరుచుకుపడింది. అంతేకాదు, బుల్లెట్ రైలు ప్రాజెక్టు కూడా ఉద్యోగావకాశాలను అందివ్వలేదని తేల్చి చెప్పింది. ప్రధాన మంత్రి కౌశల్య వికాశ్ యోజన పథకంపై ప్రశ్నల వర్షం కురిపించింది.

మోదీ రెండోసారి ఎన్నికయ్యాక షేర్ మార్కెట్ ఉవ్వెత్తున ఎగసిందని, జీడీపీ వృద్ధి రేటు మాత్రం మందగించిందని విమర్శించింది. ఇక నిరుద్యోగం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని, నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతోందని, ఇది శుభపరిణామం కాదని హెచ్చరించింది. ఏవియేషన్ రంగం పరిస్థితి కూడా ఏమంత బాగోలేదని సామ్నా తన ఎడిటోరియల్‌లో దుమ్మెత్తి పోసింది. విమనాశ్రయాలు ఉన్నా విమానాలు లేవని ఆరోపించింది.