పోలీసుల చుట్టూ సివిల్‌ మ్యాటర్‌..! ఏది నిజం..?

తెలంగాణ పోలీసులంటేనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఫ్రెండ్లీ పోలిసింగ్‌ వ్యవస్థతో పోలీసు శాఖపై ప్రజల్లో ఆదరణ పెరిగింది.. ఇదిలా ఉంటే మరోవైపు పోలీసు శాఖలో సివిల్‌ సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయంటూ  వస్తున్న వార్తలు పెను దుమారం రేపుతున్నాయి. యూసఫ్‌ గూడకు చెందిన దంపతులు అట్లూరి సురేష్‌, ప్రవిజ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్ పోలీసులపై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేశారు. ఆమె చెప్పిన దాని ప్రకారం… ఓ వ్యాపార […]

పోలీసుల చుట్టూ సివిల్‌ మ్యాటర్‌..! ఏది నిజం..?
Follow us

|

Updated on: Dec 17, 2019 | 3:26 PM

తెలంగాణ పోలీసులంటేనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఫ్రెండ్లీ పోలిసింగ్‌ వ్యవస్థతో పోలీసు శాఖపై ప్రజల్లో ఆదరణ పెరిగింది.. ఇదిలా ఉంటే మరోవైపు పోలీసు శాఖలో సివిల్‌ సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయంటూ  వస్తున్న వార్తలు పెను దుమారం రేపుతున్నాయి. యూసఫ్‌ గూడకు చెందిన దంపతులు అట్లూరి సురేష్‌, ప్రవిజ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్ పోలీసులపై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేశారు. ఆమె చెప్పిన దాని ప్రకారం… ఓ వ్యాపార వివాదంలో ఆమె భర్తపై కేసు నమోదైంది. డిసెంబర్ 8న పోలీసులు ఆమెకు కాల్ చేసి, భర్తతోపాటూ ఆమెను కూడా సాయంత్రం 4 గంటలకి స్టేషన్‌కి పిలిపించారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల సమయంలో… భార్యాభర్తల్ని ఫస్ట్ ఫ్లోర్‌లోని డీఐ రూమ్‌కి తీసుకెళ్లారు. ఆమె హ్యాండ్ బ్యాగ్, దంపతుల దగ్గరున్న ఫైల్స్, సెల్ ఫోన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె డ్రెస్ చింపేసి, అసభ్యంగా ప్రవర్తించారు. అలా తనను చిత్ర హింసలు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేశారు. తనపై కూడా అక్రమ కేసులు పెట్టారని అన్నారు. రూ.20 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలనీ, లేదంటే ఎన్‌కౌంటర్ చేస్తామని సీఐ కళింగరావు బెదిరించారన్నది ఆమె ఆరోపణ. ఆ వ్యాపార వివాదం ఇప్పటిది కాదు. ఎప్పుడో 7 నెలల కిందట పోలీసులు ఈ వివాదంలో తలదూర్చారన్నది ఆమె చేస్తున్న ఆరోపణ. అప్పటి నుంచీ తనను, తన భర్తనూ వేధిస్తున్నారని ఆమె వాదన. పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తిచించిన అంశానికి సంబంధించి తన దగ్గర ఆడియో రికార్డులు ఉన్నాయన్న ఆమె… వాటిని ఆధారాలుగా సమర్పిస్తానని తెలిపారు. ఐతే, ఈ అంశంపై స్పందించారు బంజారాహిల్స్ పోలీసులు. దంపతులిద్దరూ కావాలనే పోలీసుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేవలం కక్ష్య సాధింపు చర్యగానే వీడియో వైరల్‌ చేయడం జరిగిందని పోలీసులు వివరించారు. ఓ సివిల్ కేసు వివాదంలో వాసుదేవ్ శర్మ అనే వ్యక్తి వద్ద సురేష్ 4లక్షల  70వేల రూపాయలు తీసుకుని.. బాకీ అడిగితే ఇవ్వకుండా సురేష్ తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. అంతే కాకుండా డబ్బిచ్చిన వాసుదేవ్ శర్మను బెదిరింపులకు గురిచేసారని పోలీసులను  ఆశ్రయించాడు. దీంతో ఇది సివిల్ కేస్ కాబట్టి కోర్టుకు వెళ్లాలని సూచించారు పోలీసులు. పోలీసులు చెప్పినట్లే కోర్టుకు పోయి నోటీసులను తెచ్చి పోలీసులకు ఇవ్వడంతో కోర్టు ఆదేశాల మేరకు సురేష్ ను పిలిపించి మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. కానీ సురేష్ ఎస్సై కాలర్ పట్టుకొని తమకు పెద్ద పెద్ద వ్యక్తులు తెలుసని దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఇద్దరిపైనా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారని కక్ష సాధింపు చర్యలుగా పోలీసులపై తప్పుడు దుష్పచారం చేస్తున్నారని చెబుతున్నారు. సురేష్‌, ప్రవిజ దంపతలు పోలీస్ స్టేషన్‌ కు వచ్చి చేసిన హంగామా మొత్తం ఆధారాలతో సహా ఉన్నాయంటున్నారు పోలీసులు. ఈ ఇద్దరూ భార్య భర్తలపై గతంలో కూడా జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు నమోదై ఉందని, ఇలా మోసాలు చేసి పోలీసులనే బెదిరించడం వీరి ప్రవృత్తి అంటున్నారు పోలీసులు. కేవలం కక్ష సాధింపు చర్యగానే పోలీసులు వెల్లడించారు. ప్రజలను, పోలీసులను బెదిరించి పబ్బం గడుపుకొనే వారిని చూస్తూ ఊరుకోబోమని, చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే, అటు వాసుదేవ్‌ శర్మ కూడా జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు వాసుదేవ్‌ శర్మ..తన నుంచి అప్పు తీసుకుని అడిగితే చెల్లించకుండా తమకు పెద్దల అండదండలున్నాయని, నువ్వేమి చేయలేవంటూ బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించినట్టుగా చెప్పాడు. అంతేకాదు, సురేష్‌ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని, డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నాడని చెప్పాడు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!