పరిస్థితులు మెరుగుపడితేనే.. బడులు తెరిచేది..!
దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నామోదవుతున్నాయి. కరోనా పరిస్థితులు పూర్తిగా మెరుగుపడిన తర్వాతే ఢిల్లీలో బడులు తెరుస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. నగరంలో
దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా పరిస్థితులు పూర్తిగా మెరుగుపడిన తర్వాతే ఢిల్లీలో బడులు తెరుస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. నగరంలో కరోనాకు సంబంధించి మెరుగైన పరిస్థితులు ఏర్పడినట్లు పూర్తి నమ్మకం ఏర్పడేవరకు పాఠశాలలను తెరిచేదిలేదని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెక్రటేరియట్లో సీఎం జెండా ఎగురవేశారు.
ఈ నేపథ్యంలో.. కరోనా వ్యాప్తి నివారణ చర్యలతో.. ప్రస్తుతం ఢిల్లీలో మెరుగైన పరిస్థితులు ఉన్నాయని, ఇప్పుడు కరోనా అదుపులోనే ఉందని, దీనికి సహకరించిన కేంద్ర ప్రభుత్వం, వివిధ శాఖలు, సంస్థలు, కరోనా యోధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆప్ ప్రభుత్వానికి విద్యార్థుల భద్రత, ఆరోగ్యం చాలా ముఖ్యమని చెప్పారు. తాను ప్రజలను కలుస్తున్నానని, వారు పాఠశాలలు తెరవద్దని కోరుతున్నారని వెల్లడించారు. వారికి తాను భరోసా ఇవ్వాలనుకుంటున్నానని, పరిస్థితులు పూర్తిగా సంతృప్తి కలిగినప్పుడే పాఠశాలలను తెరుస్తామని స్పష్టం చేశారు.
Read More:
తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!