పేలుడు ప‌దార్ధాలు తరలిస్తున్న ముఠాకు వెస్ట్ బెంగాల్ పోలీసులు చెక్

| Edited By:

Mar 09, 2019 | 3:21 PM

వెస్ట్ బెంగాల్ : పేలుడు పదార్ధాలను తరలిస్తున్న ముఠాకు కోల్ కతా పోలీసులు చెక్ పెట్టారు. ఒడిషా నుంచి నార్త్ పర్గనాస్ దిశగా వెళ్తున్న ఓ వాహనాన్ని వెస్ట్ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసకున్నారు. వాహనాన్ని పరిశీలించగా అందులో 27బ్యాగుల్లో సుమారు 1000కిలోల పేలుడు పదార్ధాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం అన్ని బ్యాగుల్లో పొటాషియం నైట్రేట్ ఉండటంతో.. పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. వాహనాన్ని నడిపిస్తున్న డ్రైవర్ తో పాటు హెల్పర్ ను […]

పేలుడు ప‌దార్ధాలు తరలిస్తున్న ముఠాకు వెస్ట్ బెంగాల్ పోలీసులు చెక్
Follow us on

వెస్ట్ బెంగాల్ : పేలుడు పదార్ధాలను తరలిస్తున్న ముఠాకు కోల్ కతా పోలీసులు చెక్ పెట్టారు. ఒడిషా నుంచి నార్త్ పర్గనాస్ దిశగా వెళ్తున్న ఓ వాహనాన్ని వెస్ట్ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసకున్నారు. వాహనాన్ని పరిశీలించగా అందులో 27బ్యాగుల్లో సుమారు 1000కిలోల పేలుడు పదార్ధాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం అన్ని బ్యాగుల్లో పొటాషియం నైట్రేట్ ఉండటంతో.. పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. వాహనాన్ని నడిపిస్తున్న డ్రైవర్ తో పాటు హెల్పర్ ను కూడా అరెస్ట్ చేశారు. పేలుడు పదార్ధాలు ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు.