AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding: 600 కోట్లతో.. అంగరంగ వైభవంగా.. మంత్రి కూతురు పెళ్ళి..!

కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు తన కుమార్తె వివాహానికి సుమారు 600 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం హైదరాబాద్‌కు చెందిన

Wedding: 600 కోట్లతో.. అంగరంగ వైభవంగా.. మంత్రి కూతురు పెళ్ళి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 04, 2020 | 10:31 PM

Share

Wedding: కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు తన కుమార్తె వివాహానికి సుమారు 600 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం హైదరాబాద్‌కు చెందిన లలిత్ సంజీవరెడ్డితో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నెల 5న బళ్లారిలో జరిగే ఈ వేడుకకు హాజరవ్వాలంటూ ప్రధాని మోదీ సహా అనేకమంది నేతలకు ఆహ్వానాలు అందాయి. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. వివాహానికి 600 కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి.

ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పెళ్లి హడావుడి మొదలైంది. తొమ్మిది రోజుల పాటు పెళ్లి వేడుకలను నిర్వహిస్తున్నారు. గతంలో శ్రీరాములు గురువు గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహం కూడా భారీ ఖర్చుతో చేశారు. ఇప్పుడు అంతకన్నా ఘనంగా శ్రీరాములు కుమార్తె పెళ్లి జరగనుందని తెలుస్తోంది. వివాహం జరిపించేందుకు 500మంది పూజారులను పిలిచారు. పెళ్లి వంటల కోసం వెయ్యిమంది వంటవాళ్లు ఇప్పటికే విచ్చేశారు. పెళ్లికి రావాలంటూ సుమారు లక్ష ఆహ్వాన పత్రికలు పంచారు.