5

ఓటమి తర్వాత ఒక్కటే అనుకున్నాం… ఇంటర్వ్యూలు ఇవ్వాలని అనిపించలేదు… హార్దిక్ పాండ్యా…

మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ దక్కడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఆ అవార్డు దక్కుతుందని అసలు ఊహించలేదని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నారు.

ఓటమి తర్వాత ఒక్కటే అనుకున్నాం... ఇంటర్వ్యూలు ఇవ్వాలని అనిపించలేదు... హార్దిక్ పాండ్యా...
Follow us

| Edited By:

Updated on: Dec 08, 2020 | 10:01 PM

ఆసీస్‌తో మూడు టీ20ల సిరీస్ భారత్ వశమైంది. ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌ అవార్డు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు దక్కింది. అవార్డు రావడంపై పాండ్యా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ…. ‘ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ దక్కడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఆ అవార్డు దక్కుతుందని అసలు ఊహించలేదు. జట్టుగా సమష్టిగా రాణించడంతోనే ఆసీస్‌పై సిరీస్‌ సాధించాం. రెండో వన్డేలో ఓటమి తర్వాత ఒకటే అనుకున్నాం. ఇది నాలుగు మ్యాచ్‌ సిరీస్‌గానే భావించాం(చివరి వన్డే, మూడు టీ20లు). ఫలితంగా వరుసగా మూడు విజయాలు సాధించాం. ఇది మా జట్టులో సంతోషాన్ని తీసుకొచ్చింది. సిరీస్‌ ఆరంభమైన తర్వాత నాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని అనిపించలేదని అన్నాడు.

కేవలం ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు మాత్రమే ఎంపికైన హార్దిక్‌.. స్వదేశానికి బయల్దేరనున్నాడు. గతేడాది వెన్నుగాయం కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న హార్దిక్‌ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ను సాధించలేదు. ఈ సిరీస్‌లో అడపా దడపా బౌలింగ్‌ వేసిన హార్దిక్‌కు తగినంత విశ్రాంతి ఇవ్వాలనే యోచనలో ఉన్న బీసీసీఐ.. అతనికి టెస్టుల్లో ఎంపిక చేయలేదు. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకునే హార్దిక్‌కు విశ్రాంతి ఇవ్వడం జరిగింది.