కరోనా ల్యాబ్​లోనే తయారైంది..నితిన్ గడ్కరీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ప్రపంచ దేశాలను ప‌ట్టిపీడిస్తోన్న కరోనావైర‌స్ మ‌హమ్మారి సహజంగా రాలేదని.. ల్యాబ్​లో తయారు చేసినదే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేంద్ర చిన్న మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌‌మ‌ల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు. ” మనం కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్​ సహజంగా వచ్చినది కాదు. ల్యాబ్​లో తయారుచేసినది. ప్రపంచ దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. . వీలైనంత త్వరగా […]

కరోనా ల్యాబ్​లోనే తయారైంది..నితిన్ గడ్కరీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
Follow us

|

Updated on: May 14, 2020 | 12:02 AM

ప్రపంచ దేశాలను ప‌ట్టిపీడిస్తోన్న కరోనావైర‌స్ మ‌హమ్మారి సహజంగా రాలేదని.. ల్యాబ్​లో తయారు చేసినదే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేంద్ర చిన్న మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌‌మ‌ల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు.

” మనం కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్​ సహజంగా వచ్చినది కాదు. ల్యాబ్​లో తయారుచేసినది. ప్రపంచ దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. . వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. అని నితిన్​ గడ్కరీ, వ్యాఖ్యానించారు.

కరోనా విప‌త్క‌ర ప‌రిస్థితులు తీసుకురావ‌డం వ‌ల్ల‌ పరిశ్రమలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడిన అంశంపై స్పందించిన గడ్కరీ… ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అనుకూలతలు క్రియేట్ చెయ్య‌డం సవాలుతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. ఇండియా​ ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కునేందుకు సన్నద్ధంగానే ఉందని అభిప్రాయపడిన గడ్కరీ.. ధైర్యంగా వైరస్​ను ఎదిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా చైనాలోని ఓ ల్యాబ్‌ నుంచి బయటకు వచ్చిందని ప్ర‌పంచంలోని చాలా దేశాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. అమెరికాతో పాటు బ్రిటన్​, జర్మనీ వంటి దేశాలూ క‌రోనా గురించి చైనాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన దాఖ‌లాలు కూడా ఉన్నాయి. భారత్‌ మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు ఏ విధ‌మైన కామెంట్స్ చెయ్య‌లేదు. అయితే తొలిసారిగా భారత ప్రభుత్వంలోని భాగస్వామ్యమైన ఓ వ్యక్తి చైనాపై ఈ విధంగా విమర్శలు చేయడం సంచలనమైంది.