AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిబ్రవరి 24-26 తేదీల మధ్య ఇండియాకు ట్రంప్ ? కుదరనున్న భారీ డీల్ !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24-26 తేదీల మధ్య ఇండియాను సందర్శించే అవకాశాలున్నాయి. అయితే ఈ తేదీలు ఇంకా ఖరారు కావలసి ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక భారత సందర్శనకు రావడం ఇదే మొదటిసారి. తన దేశంలో అభిశంసనను ఎదుర్కొంటూ.. అదే సమయంలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన భారత విజిట్ పై వైట్ హౌస్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఆయన మన దేశాన్ని సందర్శించినప్పుడు.. ఉభయ దేశాల […]

ఫిబ్రవరి 24-26 తేదీల మధ్య ఇండియాకు ట్రంప్ ? కుదరనున్న భారీ డీల్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 29, 2020 | 6:03 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24-26 తేదీల మధ్య ఇండియాను సందర్శించే అవకాశాలున్నాయి. అయితే ఈ తేదీలు ఇంకా ఖరారు కావలసి ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక భారత సందర్శనకు రావడం ఇదే మొదటిసారి. తన దేశంలో అభిశంసనను ఎదుర్కొంటూ.. అదే సమయంలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన భారత విజిట్ పై వైట్ హౌస్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఆయన మన దేశాన్ని సందర్శించినప్పుడు.. ఉభయ దేశాల మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదరవచ్చునని తెలుస్తోంది. ట్రంప్ రాకకు ముందు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ రాబర్ట్ లిథిజర్ ఫిబ్రవరి రెండో వారంలో ఢిల్లీని చేరుకొని మెగా ట్రేడ్ డీల్ ను ఖరారు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇది 10 బిలియన్ డాలర్ల (రూ. 71 వేల కోట్ల) ఒప్పందమని తెలిసింది. రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ కు ఇది మార్గాన్ని సుగమం చేస్తుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

ఈ డీల్ కు సంబంధించిన లాంఛనాలను రాబర్ట్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఖరారు చేయవచ్చు. దావోస్ లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా ఉభయ దేశాల అధికారుల మధ్య సమావేశాలు జరిగాయి. యుఎస్ నుంచి ఆరుగురు సభ్యులతో కూడిన ఓ బృందం ఈ మధ్య ఢిల్లీని సందర్శించి గోయెల్ తోను, ఇతర అధికారులతోను చర్చలు జరిపింది. గోయెల్ గత ఏడాది అమెరికాలో లిథిజర్ తో భేటీ అయ్యారు.

గత కొంతకాలంగా భారత-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు కొంతవరకు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అమెరికన్ వస్తువులపై  భారత ప్రభుత్వం సుంకాలు పెంచడాన్ని ఆ దేశం జీర్ణించుకోలేకపోతోంది. రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ కొనసాగుతోంది. ట్రంప్, ప్రధాని మోడీ కొన్ని సార్లు భేటీ అయినప్పటికీ.. ఈ సమస్యపై వారు చర్చించలేదు. అయితే భారత్ తమ మిత్ర దేశమని, మోడీ తనకు మంచి మిత్రులని ట్రంప్ ప్రశంసిస్తూ వచ్చారు.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు