దారుణం..జన్మనిచ్చిన అమ్మనే సజీవ దహనం చేసిన కొడుకు
ఉత్తర్ప్రదేశ్ షాజహాన్పుర్లో దారుణం జరిగింది. నిద్రిస్తున్న తల్లిపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు ఓ శాడిస్ట్ కుమారుడు.
ఉత్తర్ప్రదేశ్ షాజహాన్పుర్లో దారుణం జరిగింది. నిద్రిస్తున్న తల్లిపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు ఓ శాడిస్ట్ కుమారుడు. తీవ్రగాయాలపాలైన ఆమె.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళ్తే.. కొంతకాలంగా రత్నా దేవి(58), ఆమె తనయుడు ఆకాశ్ గుప్తా మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా తల్లిని చంపాలనుకున్న ఆకాశ్... భార్య, బంధువులతో కలిసి పక్కా ప్లాన్ వేశాడు. సోమవారం తెల్లవారుజామున రత్నా దేవి నిద్రిస్తున్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసి, నిప్పంటించాడు. రత్నా దేవి కేకలు విన్న ఇరుగుపొరుగువారు.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలపాలైన రత్నా దేవి.. చికిత్స పొందుతూ మరణించింది. నిందితులు ఆకాశ్ గుప్తా సహా.. అతడి బంధువులు అచెలాల్, వినోద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read :