AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం కల్పిస్తున్న పథకాలు, నిధులు ఎంతమాత్రం సహాయం కాదు.. అది పూర్తిగా రాష్ట్ర హక్కు..

తమిళనాడుకు కేంద్రం కల్పిస్తున్న పథకాలు, నిధులు ఎంతమాత్రం సహాయం కాదని, అది పూర్తిగా రాష్ట్ర హక్కు అని అమిత్‌షా అన్నారు. గతంలో పథకాలు, నిధులకు రాష్ట్రం నోచుకునేది కాదని..

కేంద్రం కల్పిస్తున్న పథకాలు, నిధులు ఎంతమాత్రం సహాయం కాదు.. అది పూర్తిగా రాష్ట్ర హక్కు..
Sanjay Kasula
|

Updated on: Nov 21, 2020 | 9:14 PM

Share

పథకాలు, నిధులుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనదైన తరహాలో వ్యాఖ్యానించారు. తమిళనాడుకు కేంద్రం కల్పిస్తున్న పథకాలు, నిధులు ఎంతమాత్రం సహాయం కాదని, అది పూర్తిగా రాష్ట్ర హక్కు అని అమిత్‌షా అన్నారు. గతంలో పథకాలు, నిధులకు రాష్ట్రం నోచుకునేది కాదని, మోదీజీ రాష్ట్ర హక్కులకు భరోసాగా నిలిచారని చెప్పారు.

చెన్నైలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అమిత్‌షా శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, తమిళనాడుకు అన్యాయం జరిగిందని డీఎంకే నేతలు ఒక్కోసారి అంటుండటం తన దృష్టికి వచ్చిందని అన్నారు. డీఎంకే, కాంగ్రెస్ పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నారని, ఆ పదేళ్లలో తమిళనాడుకు ఎక్కువ సాయం అందిందో, తమ ప్రభుత్వ హయాంలో ఎక్కువ సాయం అందిందో చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని అమిత్‌షా పేర్కొన్నారు.

కాగా, త్వరలో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్యయకర్త  పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2021 ప్రథమార్థంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమిత్‌షా రాష్ట్ర పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.