Uddhav Thackeray writes to PM Modi: ఓవైపు కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీకి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే లేఖ రాశారు. పీజీ మెడికల్ ఫైనల్ ఎగ్జామ్స్ ను డిసెంబర్ వరకు వాయిదా వేయాలని ఆ లేఖలో కోరారు. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. ఫైనల్ ఇయర్ రెసిడెంట్ డాక్టర్స్ కరోనా పోరులో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ నేపథ్యంలో వారి సేవలు ఎంతైనా అవసరమని అభిప్రాయం వ్యక్తంచేశారు. కాగా షెడ్యూల్ ప్రకారం జూలై 15 నుంచి ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది.
Also Read: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అగ్ని ప్రమాదం