కరకట్ట కాలువలోకి దూసుకెళ్లిన కారు.. తల్లీ కొడుకుల దుర్మరణం
కృష్ణా జిల్లా విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరకట్టపై నుండి వెళుతున్న ఓ కారు అదుపుతప్పి కరకట్టపై నుండి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీ బిడ్డలు మృత్యువాతపడ్డారు. అవనిగడ్డ కరకట్టపై నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి పెద్ద కుమారుడు అక్కడిక్కడే మృతి చెందగా, భర్త, రెండేళ్ల చిన్న కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు.
కృష్ణా జిల్లా విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరకట్టపై నుండి వెళుతున్న ఓ కారు అదుపుతప్పి కరకట్టపై నుండి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీ బిడ్డలు మృత్యువాతపడ్డారు. అవనిగడ్డ కరకట్టపై నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి పెద్ద కుమారుడు అక్కడిక్కడే మృతి చెందగా, భర్త, రెండేళ్ల చిన్న కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. రాఖీ పండుగ సందర్భంగా అవనిగడ్డలోని తన సోదరి ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకుని అర్ధరాత్రి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకుపోయి ప్రమాదానికి గురైంది. కారులో ఉన్న తల్లీ కొడుకు మృతి చెందారు. భర్త, రెండేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారుతో పాటు మృత దేహాలను వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ తండ్రి కొడుకులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.