Hyderabad: న్యూఇయర్‌ వేళ హైదరాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న కార్లపైకి దూసుకెళ్లిన మరో కారు.. ఇద్దరు మృతి

|

Jan 01, 2023 | 8:44 AM

కొత్తేడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెబుతోన్న తరుణంలో హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. బంజరాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 3లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వెళ్లే రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు ఓ టిఫిన్‌ సెంటర్‌ వద్ద ఆగి ఉన్న రెండు కార్లను...

Hyderabad: న్యూఇయర్‌ వేళ హైదరాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న కార్లపైకి దూసుకెళ్లిన మరో కారు.. ఇద్దరు మృతి
Road Accident
Follow us on

కొత్తేడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెబుతోన్న తరుణంలో హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. బంజరాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 3లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వెళ్లే రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఓ టిఫిన్‌ సెంటర్‌ వద్ద ఆగి ఉన్న రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో టిఫిన్‌ సెంటర్‌ వద్ద రోడ్డుపై ఉన్న ఇద్దరు కస్టమర్లు అక్కడిక్కడే మృతి చెందారు. ఇక కారులో ప్రయాణిస్తున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇదిలా ఉంటే.. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఎయిర్‌ బ్యాగ్‌ ఓపెన్‌ అయ్యిందంటేనే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. టిఫిన్‌ సెంటర్‌ దగ్గర పార్క్ చేసి ఉన్న రెండు కార్లను అత్యంత వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్లు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..