హైదరాబాద్‌.. బీఆర్కే భవన్ లో.. కరోనా కలకలం..

| Edited By:

Jun 08, 2020 | 4:04 PM

తెలంగాణాలో జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆర్థికశాఖలో కరోనా కలకలం రేపుతోంది. బి ఆర్ కే భవన్ లో 8వ అంతస్తులో ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

హైదరాబాద్‌.. బీఆర్కే భవన్ లో.. కరోనా కలకలం..
Follow us on

తెలంగాణాలో జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆర్థికశాఖలో కరోనా కలకలం రేపుతోంది. బి ఆర్ కే భవన్ లో 8వ అంతస్తులో ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అటెండర్, ఆఫీస్ బాయ్ లకు పాజిటివ్ గా నిర్ధారణ. వారిద్దరూ తండ్రీ కొడుకులు. వారి కుటుంబంలో నలుగురికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో.. ఆర్థికశాఖ ఉన్న 8వ అంతస్తులో ఉద్యోగులను విధుల్లోకి రావొద్దని అధికారులు ఆదేశించారు. ఉద్యోగులు ఎవరూ బయటికి రాకుండా హోం క్వారంటైన్‌లో ఉండాలని ప్రకటించారు. సెక్రటేరియట్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొత్తం 30 మంది ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు హోమ్ క్వారంటైన్‌కు వెళ్లారని తెలుస్తోంది.

కాగా.. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. 4వ ఫ్లోర్ లోని ఒక సెక్షన్ లో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. ఫోర్త్ ఫ్లోర్ లో శానిటైజేషన్ చర్యలు ప్రారంభించారు. దాదాపు 1500 వందల మంది ఉద్యోగులు బల్దియా లో పనిచేస్తున్నారు. ఈ సంఘటనతో 4వ ఫ్లోర్ లో పనిచేసే ఉద్యోగులందరిని అధికారులు ఇళ్ళకు పంపించారు.

Also Read: కరోనాపై విజయం.. యాక్టివ్ కేసులు లేని దేశంగా..