లాక్డౌన్ మందుబాబులకు నరకం చూపిస్తోంది. ఎక్కడికక్కడ వైన్షాపులు మూతపడటం, బార్లు తెరచుకోకపోవడం, ఆఖరుకు కల్లుకు కూడా ఆంక్షలు పెట్టడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు మందుబాబులు. కొందరైతే దారుణాలకు ఒడిగట్టుతున్నారు. కొందరు పిచ్చిక్కినట్టు ప్రవర్తిస్తున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలోని కోటపట్టినంలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు దొరకకపోవడంతో కూల్డ్రింక్లో షేవింగ్లోషన్ను కలుపుకుని తాగేశారు. ఈ ఘటనలో పాండీ, రాజా అనే ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. కూల్డ్రింక్లో షేవింగ్లోషన్ను కలిపి తాగితే మందు తాగిన కిక్ వస్తుందని ఎవరో చెబితే మద్యానికి బానిసైన నలుగురు ఇలా చేశారు.