AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మమ్మ చేతి వంట ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసింది

చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమ్మమ్మ చేసిన చికెన్ కలుషితమై ఇద్దరు పిల్లలు మృతి చెందారు. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన మనవళ్లకు చికెన్ వండి పెట్టిన బామ్మ మసాలాకు బదులు గుళికల మందు వేసింది.

అమ్మమ్మ చేతి వంట ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసింది
Balaraju Goud
|

Updated on: Jun 22, 2020 | 7:42 PM

Share

చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమ్మమ్మ చేసిన చికెన్ కలుషితమై ఇద్దరు పిల్లలు మృతి చెందారు. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన మనవళ్లకు చికెన్ వండి పెట్టిన బామ్మ మసాలాకు బదులు గుళికల మందు వేసింది. అమ్మమ్మ మతి మరుపు ఆ ఇద్దరు బాలుర ప్రాణాలు తీసింది.

చిత్తూరు జిల్లాలోని రూరల్ మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఇద్దరు పిల్లలు సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి ఏ.ఎల్.పురానికి వెళ్లారు. దీంతో వాళ్ల అమ్మమ్మ పిల్లలకు చికెన్ వండిపెట్టింది. చికెన్ చేసే సమయంలో మసాలాకు బదులు ఏకంగా గుళికల మందు బిళ్లలు వేసేసింది. కలుషితమైన చికెన్ తిన్న ఇద్దరు బాలులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.