AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జైపూర్ లో కరోనా కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి పాజిటివ్..

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ క్రమంలో రాజస్ధాన్‌లోని జైపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ఏడు రోజుల కిందట ఓ వ్యక్తికి కోవిద్‌-19 పాజిటివ్‌ రిపోర్ట్‌ రాగా, ఆ కుటుంబంలోని 25 మందికి నిర్వహించిన కరోనా వైరస్‌ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ‘వారి నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించగా గత రాత్రే రిపోర్టులు […]

జైపూర్ లో కరోనా కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి పాజిటివ్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 09, 2020 | 7:49 PM

Share

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ క్రమంలో రాజస్ధాన్‌లోని జైపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ఏడు రోజుల కిందట ఓ వ్యక్తికి కోవిద్‌-19 పాజిటివ్‌ రిపోర్ట్‌ రాగా, ఆ కుటుంబంలోని 25 మందికి నిర్వహించిన కరోనా వైరస్‌ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ‘వారి నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించగా గత రాత్రే రిపోర్టులు వచ్చాయని, వారందరికీ పాజిటివ్‌గా తేలిందని..వారందరినీ ఆస్పత్రికి తరలించామ’ని వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ నరోత్తమ్‌ శర్మ వెల్లడించారు.

ఈ కోవిద్-19 బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా జైపూర్‌లోని సుభాష్‌ చౌక్‌ ప్రాంతానికి చెందిన వారని అధికారులు తెలిపారు. రాజస్ధాన్‌లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న నగరం జైపూర్‌ కావడం గమనార్హం. జైపూర్‌ తర్వాత ఎడ్యుకేషన్‌ హబ్‌గా పేరొందిన కోట, జోథ్‌పూర్‌ నగరాలు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారాయి. రాజస్ధాన్‌లో ఇప్పటివరకూ 11,000కు పైగా కరోనా వైరస్‌ కేసులు నమోదవగా, మహమ్మారి బారినపడి 251 మంది మరణించారు.

[svt-event date=”09/06/2020,7:39PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also Read: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..: ప్రపంచ ఆరోగ్య సంస్థ