బీజేపీలో చేరినోళ్లు ఓట్లు తేలేరు..

| Edited By:

Oct 03, 2019 | 10:31 PM

టీడీపీ నుంచి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన వారికి ఓట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గురువారం రాత్రి జరిగిన టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో ఆయన మాట్లాడారు. తమ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలు ఓట్లు సంపాదించుకోలేని నేతలే పార్టీలు మారుతున్నారని విమర్శించారు. ఇప్పటికే టీడీపీ నుంచి బీజేపీకి జంప్ అయిన సీఎం రమేశ్, సుజనా చౌదరిలు ఓట్లు తెచ్చుకోలేరన్నారు. తమ పార్టీ బలమైన కార్యకర్తలతో […]

బీజేపీలో  చేరినోళ్లు ఓట్లు తేలేరు..
Follow us on

టీడీపీ నుంచి బయటకు వెళ్లి బీజేపీలో చేరిన వారికి ఓట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గురువారం రాత్రి జరిగిన టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో ఆయన మాట్లాడారు. తమ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలు ఓట్లు సంపాదించుకోలేని నేతలే పార్టీలు మారుతున్నారని విమర్శించారు. ఇప్పటికే టీడీపీ నుంచి బీజేపీకి జంప్ అయిన సీఎం రమేశ్, సుజనా చౌదరిలు ఓట్లు తెచ్చుకోలేరన్నారు. తమ పార్టీ బలమైన కార్యకర్తలతో నిర్మించబడిందన్నారు. దేశంలో ఏక పార్టీ విధానానికి బీజేపీ తెరతీసిందని, ఆది సరికాదన్నారు.